Thursday, December 17, 2009

ద్రవ్యోల్బణం


"స్వాప్" లు

ఈ మధ్య జింబాబ్వే లో ద్రవ్యోల్బణం వల్ల--వీధి చివర కొట్లో బటాణీలు కొనుక్కోడానికి, తన రెండుచేతులనిండా తన గడ్డం యెత్తువరకూ--తాను మోయలేకపోతున్నన్ని డబ్బుల కట్టల్ని మోసుకొంటూ వెళుతున్న యేడెనిమిదేళ్ళ పిల్ల ఫోటోలు, వాళ్ళ 50 మిలియన్ డాలర్ల నోటు--ఇలా కొన్ని ఫోటోలు అంతర్జాలం లో ఈమెయిళ్ళలో ప్రయాణించాయి--మీరు చూసే వుంటారు.  


మరి అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం యేమి చేస్తోంది?  


కొన్ని పెద్ద దేశాలు--ఐక్యరాజ్య సమితి ఆదేశాలవల్లో, ప్రపంచ బ్యాంకు చెప్పినందువల్లో, అలాంటి దేశాలకి కొన్ని కోట్ల డాలర్లు ఋణాలు మంజూరు చేశాయి అనుకుందాం. అలా చాలా చిన్న దేశాలకి అప్పులిచ్చారనుకుందాం.  


ద్రవ్యోల్బణం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, ఇక ఈ జన్మలో అలాంటి ఋణాలు వసూలు అవవు అని ఓ నిశ్చయానికి వచ్చేస్తాయి ఆ పెద్ద దేశాలు!  


అప్పుడు ఓ అంతర్జాతీయ సంస్థ ఓ పెద్ద దేశపు ప్రభుత్వాన్ని సంప్రదించి, 'మీరు ఫలానా ఫలానా దేశాలకి ఇచ్చిన అప్పులు వసూలవవు అని నిశ్చయించుకున్నారుకదా, వాటిని మాకు అమ్మెయ్యండి--ఒక డాలరుకి మీకు 15 సెంట్లు మా సంస్థ చెల్లిస్తుంది ' అని బేరం పెడతారు.  


ఆ దేశం, చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకొని, వాళ్ళతో ఒప్పందానికి వచ్చేస్తుంది!  


అప్పుడు ఆ సంస్థ, ఆయా పేద దేశాల దగ్గరకి వెళ్ళి, మీ అప్పులు మొత్తం వసూలు చేసుకొనే హక్కులు మాకు వచ్చాయి, మీరుగనక డాలరుకి 25 సెంట్లు మాకు చెల్లిస్తే, ఆ ఋణాలన్నీ రద్దు చేసేస్తాం--కానీ--దీనికి ప్రతిగా--మీ బీచిలదగ్గరా, కొండలదగ్గరా, అడవుల్లోనూ--ఇన్ని వేల యెకరాలు మాకు రాసివ్వాలి' అని బేరం పెడతాయి. (సహజం గా ఆ భూములు టూరిస్టు స్పాట్ లో, గనులో, బోళ్ళు కలపా, ఇతర వాణిజ్యపరమైన వుత్పత్తులు యెక్కువగా జరగడానికి అనువైన స్థలాలో అయి వుంటాయి!) (ఇలాంటి బేరాలకోసం ఆ ప్రభుత్వం లో ఓ ప్రముఖ మంత్రినో, రాజుగారి అల్లుణ్ణో, సక్రమ/అక్రమ సంతానాల్లో ఒకణ్ణో పట్టుకొని, ఓ పెద్దమొత్తం లంచం ఇస్తారు!)  


ఇలాంటి వొప్పందాలవల్ల, కొన్ని కోట్ల విలువైన భూములు దక్కడమే కాకుండా, వీళ్ళ దగ్గర వసూలు చేసే దానికి, వాళ్ళకి చెల్లించేదానికీ తేడా--డాలరుకి 10 సెంట్లు--కూడా వాళ్ళకి లాభమే!  


ఇలాంటివాటిని "ఈక్విటీ-డెట్ స్వాప్" లు అంటారు.  


మన గాలి, జగన్లు ఇంకా ఇలాంటివి ప్రయత్నించినట్టులేదు! (మనీలాండరింగ్ తో సరిపెట్టారు!)  


ఆ దేశాలు అదృష్టవంతులు!

Sunday, November 29, 2009

కోట్లలో జరిగే....


జూదాల నిషేధం

‘వస్తువుల సరఫరా గొలుసులో ఉన్న ప్రతీ ఒక్కరికీ గరిష్ఠ లాభ నియంత్రణను విధిస్తే ధరల పెరుగుదలను అరికట్టవచ్చు’ అని అభిప్రాయపడింది—పార్లమెంటరీ అంచనాల సంఘం! వారి నివేదిక పార్లమెంటులో ప్రవేశ పెట్టబడిందట. నవంబరు 14న పార్లమెంట్ చర్చించిందట కూడా!

వాళ్ళు చేసిన అతిముఖ్య సూచన—‘బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పులపై ఫ్యూచర్స్ ట్రేడింగ్ ను నిషేధించాలి’—అని.

పై రెండూ ఎంతచక్కని సిఫార్సులో గమనించండి—వీటిని అమలుపరిచే మగాడు యెవరైనా, యే పార్టీలోనైనా వున్నాడా? వుంటే వెంటనే ఓ పార్టీ పెట్టేస్తే వాణ్ణి ప్రథాన మంత్రిని చెయ్యడానికి యెవరికీ అభ్యంతరం వుండదనుకుంటా!

ఇంకాకొన్ని సిఫారసులు—కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖలో కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ధరల పర్యవేక్షణ విభాగం ఉండాలి. బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పులు తదితర 17 నిత్యావసరాల ధరలను నిత్యం పర్యవేక్షించాలి. నియంత్రణ అధికారాలూ ఇవ్వాలి.

సమాజం లోని అన్నివర్గాలకూ నిత్యావసరాలు అందించే విధం గా రేషన్ సరుకుల సరఫరా వ్యవస్థను పరిపుష్టం చేయలి.

అక్రమ నిల్వల్ని అరికట్టడానికి తాత్కాలిక నోటిఫికేషన్లు కాకుండా శాశ్వత చర్యలు ఉండాలి. కేంద్రం ఆదేశాల మేరకు అక్రమనిల్వలపై చర్యలు తీసుకోని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చ్దే రేషన్ కోటా నిలిపేయాలి.

నిత్యావసరాల చట్టం ఉల్లంఘించే వారిపై కేసుల దర్యాప్తునకు ప్రత్యేక కోర్టులను యేర్పాటు చేయాలి.

ఒకపక్కన పప్పుల ధరలు మండుతుంటే….వ్యాపారులు రెండులక్షల టన్నుల పప్పులను దిగుమతిచేసుకొని, ముంబయి, ట్యూటికోరిన్ రేవుల్లోని గోదాముల్లో దాచిపెట్టడం ఘోరం. నిత్యావసరాల అక్రమ నిల్వలపై ప్రభుత్వం కఠినం గా వ్యవహరించాలి.--ఇవీ!

మన పెజారాజ్యాలూ, లోక్ సత్తాలూ ఇలాంటివాటికోసం ఆందోళనలు చేస్తే బాగుండును!

Thursday, November 19, 2009

ఆకులు నాకేవాళ్ళ.....


.....మూతులు నాకేవాళ్ళు


బ్యాంకులు చేసేపని ప్రజల దగ్గర వారి అవసరానికి మించిన, లేదా పొదుపు చేసుకున్న డబ్బుని 'డిపాజిట్'ల రూపం లో సేకరించి, వారికి కొంత వడ్డీని ఇవ్వడం--అవసరం వున్నవాళ్ళకి మళ్ళీ ఆ డబ్బుని అప్పుగా ఇవ్వడం, దానిమీద కొంచెం యెక్కువ వడ్డీ తీసుకోవడం. ఆ వడ్డీలమధ్య తేడానే బ్యాంకుల లాభం. 


స్థూలంగా ఇదీ సంగతి.  


ఓ కేంద్ర ఆర్థిక మంత్రి కన్ను ఈ వడ్డీ ఆదాయం మీద పడింది. 


దాంతో, తన బడ్జెట్ లో ఈ బ్యాంకుల వడ్డీ ఆదాయం మీద చట్ట సభలో 'ఇంటరెస్ట్ ఆన్ టాక్స్' అని ప్రకటించి, పన్ను విధించాడు! (తరవాత దిద్దుకుని, 'టాక్స్ ఆన్ ఇంటరెస్ట్' గా మార్చి వ్యవహరించారు.)  


ఇంకేం? కాలుమీద కాలువేసుకుని కూర్చొని, ఆయాసపడకుండా యెంత సంపాదన--ప్రభుత్వానికి! యెంత మహత్తరమైన ఆలోచన!  


అప్పుడు బ్యాంకులు తక్కువ తిన్నాయా! 


నెమ్మదిగా 'వడ్డీయేతర ఆదాయం' పెంచుకోవడం మొదలెట్టాయి--ఈ చార్జీ, ఆ చార్జీ అని యెడా పెడా వాయించడం మొదలెట్టాయి!  


కొన్నేళ్ళకి ఆ వడ్డీ లెఖ్ఖలూ, దానిమీద పన్నుల లెఖ్ఖలూ కోసం అయ్యే ఖర్చే వచ్చే ఆదాయాం కన్నా యెక్కువ అవడం, బ్యాంకుల, ఖాతాదారుల ఫిర్యాదుల కారణం గానూ, పైగా వోట్ల కోసం--ఇంకో ఆర్థిక మంత్రి చేత ఈ పన్ను తొలగించబడింది.  


హమ్మయ్య అనుకున్నాయి బ్యాంకులు. (అలా అని వడ్డీయేతర అదాయాన్ని పెంచుకునే మార్గాలు మరిన్ని కనిపెట్టడం మానలేదు--తుమ్మితే చార్జి, దగ్గితే చార్జి అంటూ మొదలెట్టాయి. ప్రైవేట్ బ్యాంకులైతే మరీనూ!)  


అంతలో వచ్చాడు--'నల్లనివాడు, గుంటకన్నులవాడు' కాదు--ఇంకో ఆర్థిక మంత్రి! ఈసారి ఇంకా మహత్తరమైన 'అవిడియా'తో! 


వచ్చి, తన బడ్జెట్ లో 'సేవా పన్ను' విధించాడు! దీంతో, బ్యాంకులే కాకుండా, టెలిఫోన్ డిపార్ట్ మెంట్ నించి, కొరియర్ సర్వీసులదాకా--వాళ్ళు చేసిన 'సేవలకి' బిల్లులు చెల్లించమనేవాళ్ళందరినీ పన్నులవల లోకి లాక్కొచ్చి, వినియోగదారుల గూబ పేలేసి, పన్ను వసూలు చేస్తున్నాడు. (అసలు వినియోగదారులు డబ్బు చెల్లించి కొనుక్కొనేవి సేవలు యెలా అవుతాయో మరి!) 


కాలుమీద కాలువేసుకొని, అనాయాసంగా కొన్నివేల కోట్లు సంపాదిస్తున్నాడు! యెలాగా పన్ను కడుతున్నాముకదా అని వీళ్ళు ఇంకా అనేక 'ఇతర ఆదాయ మార్గాలు' వెతుక్కుంటున్నారు!  


పైగా, ఈ సంస్థలు, తాము చెల్లించే బిల్లుల లో యెంత సేవాపన్ను చెల్లించారో, అంత--సంస్థలు చెల్లించే సేవాపన్నులో మినహాయించుకోవచ్చని, ఓ వెసులుబాటు కల్పించాడు! (నిజానికి ఇప్పుడు యే సంస్థా ఈ వెసులుబాటుని వుపయోగించుకోవడం లేదు--యెందుకంటే, సంచీ లాభం చిల్లు తీసేస్తుంది మరి!)  


యెందుకో ఈ వెర్రిమొర్రి లెఖ్ఖల మంత్రజాలం!  


మనం చదువుకున్న 'బ్యాంకింగ్' సబ్జెక్ట్ లో, 'బ్యాంకు ఖాతా తెరవగానే, పాస్ బుక్, పే ఇన్ స్లిప్ బుక్, చెక్కు బుక్ జారీ చెయ్యబడతాయి. పాస్ బుక్ లో మన లావాదేవీలు ఉల్లేఖింపబడి మనకు అందజేయబడతాయి'--ఇలా చదువుకున్నాము. మరి ఈ రోజు, పాస్ బుక్ చార్జ్, చెక్కుబుక్ చార్జ్, అకౌంట్ స్టేట్ మెంట్ చార్జ్, పాస్ బుక్ అప్ డేటింగ్ చార్జ్, అప్పులకైతే లేట్ పేమెంట్ చార్జ్, ప్రీ పేమెంట్ చార్జ్, ప్రాసెసింగ్ చార్జ్, ఇన్స్ పెక్షన్ చార్జ్--ఇలా కొన్నివందల రకాల చార్జీలు వసూలు చేస్తున్నారు.  


ఇన్నాళ్టికి మన తుమ్మల కిషోర్ ఓ చక్కని పాయింటు లేవనెత్తాడు--అప్పులు ఇచ్చిన గడువు కన్నా ముందు తీర్చేవాళ్ళకి 'ప్రీ పేమెంట్' చార్జ్ వసూలు చెయ్యడం అన్యాయమని, ఇంకా అలాంటివాళ్ళకి ప్రోత్సాహకం గా రాయితీలు ఇవ్వాలి' అని.  


నిజంగా ఈ విషయం లో బాధితులు సామాన్యులే! యెందుకంటే, మిగిలినవాళ్ళు బయటి వడ్డీ కంటే, బ్యాంకు వడ్డీ చాలా చవక అని, ఛస్తే సమయానికి గానీ, సమయానికి ముందుగానీ అప్పులు కట్టరు! బ్యాంకులు విపరీతమైన వత్తిడిచేసి, పీకమీద కత్తి వేలాడదీసే పరిస్థితి వస్తే, అప్పుడు బేరం పెడతారు--యెంత వడ్డీ తగ్గిస్తావు? అసలులో యెంత తగ్గిస్తావు? అంటూ! అప్పటికే అవి నిరర్థక ఆస్తులుగా గుర్తింపబడి వుంటాయి కాబట్టి, బ్యాంకులు చచ్చినాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటాయప్పుడు!  


వినియోగదారులు ఉద్యమిస్తే వీటిలో కొన్ని నివారించవచ్చుకదూ!  


ఇంకొంచెం ఇంకోసారి.


Friday, November 13, 2009

ప్రభుత్వం బ్రహ్మాస్త్రం


చిరు వ్యాపారులు


ప్రభుత్వం ప్రతీ యేటా కొన్ని కోట్లు నష్టపోతోందట--దాదాపు 6 లక్షల మంది 125 నగరాలూ, మునిసిపాలిటీల్లో రోడ్డు పక్కన పళ్ళూ, కూరగాయలూ, పువ్వులూ, పుజా సామాగ్రీ, అమ్ముకునేవాళ్ళూ, తోపుడుబళ్ళపై పెట్టుకొని వీధులు తిరిగేవాళ్ళూ 'లైసెన్స్ ' లు యేమీ తీసుకోకపోవడం వల్ల!  


అందుకని, ప్రభుత్వం ఓ చట్టం చేస్తుందట! లైసెన్స్ లు మంజూరు చెయ్యడం, కొన్ని జోన్లకే పరిమితం చెయ్యడం లాంటి అవకతవక విధానాలు వుంటాయట ఆ చట్టం లో--యెందుకంటే ఆ రొచ్చులోంచి మరింత అవినీతి జన్మించాలికదా!  


ఇక్కడ ముఖ్య విషయం యేమిటంటే, ఇలాంటివాళ్ళ దగ్గర, 'ఆశీలు ' వసూలు చేసేది ఆయా మునిసిపాలిటీలు. వాళ్ళ దగ్గర మామూళ్ళు వసూలు చేసుకొనేదీ, ఉచితం గా సరుకులు సంగ్రహించేదీ--పోలీసులు.  


ఈ వ్యాపారుల్లో కూడా, రాజకీయ అండతోనో, మరింకో వాటితోనో కొన్ని ముఖ్య కేంద్రాల్లో తిష్ట వేసుకొని, 'ఇది మా బాబు చోటు ' అన్నట్టు, కొన్ని యేళ్ళుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం--ఇప్పుడు ఇంకొకచోటికి పొమ్మంటే పోము అనేవాళ్ళూ వున్నారు.  


అది 40 అడుగుల/60 అడుగుల/80 అడుగుల రోడ్డైనా, ఓ చిన్నకారో, ఆటో నో వెళ్ళేంత మాత్రమే ఖాళీగా వుండి, రెండుపక్కలా ఆక్రమిస్తారు వీళ్ళు.  


దీనికి పరిష్కారం--బస్ స్టాండ్ ల లోనూ, రైల్వే స్టేషన్ల ముందూ బోలెడు ఖాళీ స్థలం, చెట్లతో నీడనిస్తూ, వుంటుంది. అలాంటి చోట్ల వీళ్ళకి చోటు ఆర్ టీ సీ వారు, రైల్వే వారు లేదా మునిసిపాలిటీ వారు నామ మాత్రపు (ఆసీలుతో సమానమైన) అద్దెతో కేటాయిస్తే, 90 శాతం సమస్య తీరుతుంది.  


ఇక తమ శారీరక శ్రమతో, బళ్ళని తోసుకుంటూ వీధి వీధీ తిరిగేవాళ్ళ దగ్గర ఇంకా యెక్కువ మొత్తాలు వసూలు చెయ్యడం మాత్రం వాళ్ళ రక్తం పీల్చడం తో సమానం!  


ప్రభుత్వాలకి మంచి బుధ్ధి కలుగుగాక!


Sunday, November 1, 2009

మన పోలీసులు


పొట్టలు


ఇదివరకోసారి వ్రాశాను--స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ లాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రీ, గవర్నరూ పోలీసు పెరేడ్ తిలకించి, వందనం స్వీకరించడం, ఆ పోలీసుల, అధికారుల పొట్టల గురించీ, వాళ్ళ అస్తవ్యస్త 'మార్చింగ్' గురించీ!  


మరి అదే మిలిటరీలో అయితే, యెంత వున్నతాధికారైనా, పొట్ట అనేది వుండదు--వాళ్ళు మార్చింగ్ చేస్తూంటే, గునపాలు క్రమబధ్ధంగా చేతులు వూపుతే వెళుతున్నట్టు వుంటుంది!  


వాళ్ళు మమూలుగా బ్యారక్స్ లో కుటుంబాలతోనే (యెక్కడో సరిహద్దుల్లో తప్పించి) వున్నా, ప్రతి రోజూ పీటీ దగ్గరనించి, పెరేడ్ దాకా రెండు పూటలా చేస్తారు--ఒక్క సీరియస్ గా సిక్ అయితే తప్ప! ఆశ్రమకి తగ్గట్టు తింటారు కూడా!  


ఇప్పుడు ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందట--పోలీసులకి ప్రత్యేక శిక్షణ ఇస్తారట కొంతకాలం పాటు--ఫిజికల్ ఫిట్నెస్ కోసం (పొట్టలు తగ్గడానికి)!  


మరి ఈ పథకం తో మరిన్ని కోట్లు తగలేస్తారో, పొట్టల్ని తగ్గిస్తారో చూడాలి!  

Monday, October 19, 2009

నీటి వరద--


కన్నీటి వరద


మంత్రాలయం, కర్నూలు, నంద్యాల, గుంటూరు కృష్ణా జిల్లాలు పూర్తిగా వరద బారి పడ్డాక, మొదటి నాలుగు రోజులూ బాధితులైన వారికి అందిన సహాయం అంతంత మాత్రమే!  


ఆ తరవాత, వెల్లువలా లారీలకి లారీలు--బియ్యం, పప్పులూ వుప్పులూ, బట్టలూ, కంచాలూ-గ్లాసులూ, మందులూ--ముఖ్యం గా మంచినీళ్ళ పాకెట్లూ/పీపాలూ వెళుతున్నాయి--రోజూ!  


కానీ వాటిని క్రమబధ్ధం గా స్వీకరించి, సద్వినియోగం చెయ్యడం జరగడం లేదు! 


ఇక ప్రభుత్వ సహాయమైతే, ఓ వెయ్యి నొక్కేసి, దానికి యెవరు వొప్పుకుంటే వాళ్ళకి--అసలు వరద ముఖమే చూడనివారికీ, పెద్ద పెద్ద మేడల్లో వుండేవాళ్ళకీ--చీటీలు వ్రాసి అందజేస్తున్నారట--స్థానిక రాజకీయులు!  


మరి సహాయం పంపించేవాళ్ళు--అక్కడి అధికారులతో సమన్వయం చేసుకొని, వీళ్ళు పంపినవి వాళ్ళు స్వీకరించేలా యెందుకు చెయ్యలేకపోతున్నారు? అవి రాజకీయుల ఇళ్ళల్లోకీ, మిల్లుల్లోకీ, గోదాముల్లోకీ యెందుకు చేరుతున్నాయి? అక్కణ్ణించి మళ్ళీ యెందుకు అమ్మబడుతున్నాయి?  


ఇవన్నీ చేసేవాళ్ళకి నిష్కృతి వుంటుందా?  


వాళ్ళని దగ్గర్లోని దీప స్థంభానికో, పోలీసు స్టేషన్ కిటికీకో వురి తీస్తే తప్పేముంటుంది?  


అలెగ్జాండరు ఖాళీ చేతుల్ని గుర్తు తెచ్చుకుంటే ఇలాంటివి చెయ్యగలరా?  


యేమో మరి!




Thursday, September 17, 2009

పైపైకే.....


దిగిరావు దిగిరావు.....

ఈ పంట విస్తీర్ణం లెఖ్ఖలు నిజం గా నిజమయితే, సీజన్లో రైతులు తాము పండించిన టమాటాల్లాంటివాటిని కేజీ పది పైసలకి కూడా కొనేవాళ్ళు లేక, రోడ్డు పక్కన పారబొయ్యడమో, తగులబెట్టడమో, పశువులకి మేపడమో యెందుకు జరుగుతోంది?  


మళ్ళీ ఆ సీజన్ అయిపోగానే, అంతకు ముందు మార్కెట్ లో వున్న ధరకంటే యెక్కువగా అదే వుత్పత్తి బాగా పెరిగిన ధరతో అమ్మబడటం యేమిటి?  


మహా అయితే ఒక నెలో, రెండునెలలో ఆ ధర తగ్గకుండా కాపాడితే చాలు మార్కెట్ శక్తులకి!  


సరిగ్గా అక్కడే జరుగుతోంది గోల్ మాల్!  


నయా మార్కెటింగ్ మేనేజర్లు ఆ రెండు నెలలకీ కొనుగోళ్ళు అవసరం లేకుండా, తక్కువ ధర దగ్గరే అప్పటికి డెలివరీ ఇచ్చేలాగ కాంట్రాక్టులు చేసేసుకుంటున్నారు!  


ఈ లోపల 'అదిగో పులి ' అన్నట్టు--'కొలకత్తాలో బంగాళదుంపలు.....' లాంటి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు--మీడియా వీరికి సహకరిస్తోంది--ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వుండి, తైనాతీలు బాగా సంపాదించుకోడానికి గేట్లు యెత్తేస్తున్నారు!  


ఇంకా, నయా కార్పొరేట్ చిల్లర దుకాణాలు ప్రతీ పదార్ధాన్నీ ప్రతీ వూళ్ళోనూ టన్నులకొద్దీ నిలవేస్తున్నాయి--తరవాత ధర బాగా పెరుగుతుందని అందరూ నమ్మినప్పుడు! అలా అయితేనే ఇబ్బడి ముబ్బడి లాభాలు వస్తాయి మరి!  


ఇక చక్కెర గురించి వేరే చెప్పక్కర్లేదు!  


సీజన్లో యే రోడ్డు మీద చూసినా, వరుసగా కొన్ని వేల చెరకు బళ్ళూ, లారీలూ--అవి మొయ్యలేనంత లోడుతో చక్కెరమిల్లులవైపు యెడతెగకుండా, రాత్రీ పగలూ--మిగిలిన వాహనాలని కూడా సాఫీగా పోనివ్వకుండా, ట్రాఫిక్ జాముల్ని సృష్టిస్తూ సాగుతూనే వుంటాయి కదా?  


మరి వుత్పత్తి అయ్యే చక్కెర అంతా యేమౌతోంది?  


గత పాతిక సంవత్సరాలుగా యెప్పుడో తప్ప 'ముడి చక్కెర దిగుమతి ' చేసుకోకుండా యెప్పుడైనా జరుగుతోందా? చక్కెర కుంభకోణాలు జరగకుండా వున్నాయా? మంత్రులు సైతం రాజీనామాలు ఇచ్చి, శిక్షలు పడ్డవాళ్ళు కూడా వున్నారు కదా!  


అలాగే ధాన్యం సీజనుల్లో!  


చింతపండు లాంటి వాటికొస్తే, మన గిరిజన కోఆపరేటివ్ స్టోర్లలో టన్నులకొద్దీ మగ్గుతున్నాయని మీడియాయే చెపుతోంది!  


మరి ధరలు యెందుకు తగ్గవు?  


జనం అందరూ గట్టి నిర్ణయాలు తీసుకోవాలి--ప్రభుత్వం చేత ఆహార పదార్థాల ధరల మీద జూదాలని, మధ్యవర్తులు, కాంట్రాక్టు వ్యాపారులూ అడ్డంగా సంపాదించుకోడాన్నీ నిరోధించాలని!  


అసంఘటిత మార్కేట్ కన్నా తక్కువ ధరకి అమ్ముతామన్నా, కంపెనీల చిల్లర దుకాణాల్లో యేమీ కొనము--వాళ్ళని ఈగలు తోలుకొనేలా చేస్తాము--అని!  


దొంగ నిల్వలనీ, రవాణానీ పట్టుకున్న తరవాత రోజువారీగా యేమి జరుగుతోందో బయటపెట్టమని మీడియాని వొత్తిడి చేస్తామనీ--వాళ్ళ ఫోనులు 24 గంటలూ మోగుతూనే వుండేలా, సరైన సమాధానం ప్రతీరోజూ పేపర్లలో, టీవీల్లో వచ్చేదాకా నిద్రపోమని!  


ఇలాంటి నిర్ణయాలు తీసుకొని, అమలు చేస్తే, రెండు మూడు నెలల్లోనే ధరలు భూమిని తాకవూ?  


ఆలోచించండి!


Tuesday, September 15, 2009

పైపైకే.....


దిగిరావు దిగిరావు.....


'కొలకత్తాలో బంగాళదుంపల పైరుకి వైరస్ ' సోకిందట! అందుకని ఇక్కడ ధరలు బాగా పెరిగాయట!  


'మీ కొలకత్తాలో బంగాళా దుంపలు పండుతాయా?' అని అడిగి, 'యెలా కొట్టాను దెబ్బ?' అని అడగాలనిపించడం లేదూ?  


అదేదో సినిమాలో, మోహన్ బాబు యేటిగట్టున చెట్టుక్రింద కూర్చొని, అప్పుడే రేవుదాటి వచ్చినాయన 'అగ్గిపెట్టుందా?' అని అడిగిన ప్రశ్నకి 'మందేవూరు?' అని యెదురు ప్రశ్నవేసి, 'దోసకాయల పల్లి ' అనగానే, 'యేం? మీదోసకాయలపల్లిలో అగ్గిపెట్టెలు దొరకవా?' అనడిగి, పక్కవాళ్ళతో 'యెలాకొట్టాను దెబ్బ? ఆన్?' అంటాడు.  


మరి కొలకత్తా నగరం లో బంగాళా దుంపలు పండటమేమిటీ, వాటికి వైరస్ సోకడమేమిటీ, దాన్ని పత్రికలు ప్రముఖం గా ప్రచురించడమేమిటి!  


ఇక, చక్కెర (చెరకు) పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయిందిట--అందుకని చెక్కెర ధర బాగా పెరిగి పోయిందట!  


చింతపండు చత్తీస్ గఢ్, జార్ఖండ్ ల నించి రావడం తగ్గిపోయిందట--అందుకని చింతపండు ధర బాగా పెరిగిపోయిందట!  


ఇలా ధర పెరగని ఆహార పదార్థం యేదైనా మిగిలిందా? దీనికి అసలు కారణం యేమిటీ?  


మన ప్రభుత్వాలూ, వ్యవాసాయాధికారులూ వేసేవన్నీ కాకుల్లెక్కలు. ఇళ్ళలోనో, ఆఫీసుల్లోనో కూర్చొని, వివిధ అవసరాలకోసం తమని కలవడానికొచ్చే వాళ్ళ నించి సమాచారం సేకరించి, పంటల విస్తీర్ణం గురించి 'క్రితం యేడాది కన్నా--కొంచెం యెక్కువో, కొంచెం తక్కువో' అంచనాలువేసి, నివేదికలు సమర్పించేస్తారు!  


ఇక బ్యాంకులు ఇచ్చే పంట ఋణాల లెఖ్ఖల మీద ఆధారపడి, కొంత సర్దుబాట్లు చేస్తారు!  


ఈ లెఖ్ఖలెంత గొప్పవంటే-- ప్రతీ జిల్లాలోనూ, ఒక్కొక్క పంటకీ అవసరమైన పెట్టుబడిని అంచనావేసి, యే పంటకి--యెకరానికి--యెంత అప్పు ఇవ్వచ్చు అని నిర్ధారణ చేస్తారు (దీన్నే 'స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ' అంటారు).  


ఆప్పు యెక్కువ కావలసినవాళ్ళు, యెక్కువ దేనికి వస్తే ఆ పంట అని చెప్పి, యెక్కువ తీసుకొంటారు (నిజంగా వాళ్ళే పంట వేసినా!).  


ఇక 'ఇన్స్యూరెన్స్ ' అనే ఓ ప్రహసనం వుంది--వర్షాలు లేకపోయినా, ప్రకృతి విపత్తులు వచ్చినా, తెగుళ్ళూ వగైరా వచ్చినా--ఇన్స్యూరెన్స్ వస్తుంది. దీంట్లో ఓ మెలిక యేమిటంటే, ప్రభుత్వం 'వర్షాల్లేవు ' అని ప్రకటిస్తే, వర్షాధార నేలల్లో అలాంటి పంటలు వేసినవాళ్ళకే ఇన్స్యూరెన్స్ వస్తుంది. బోర్లు, చెరువులూ, కాలువల కింద భూములకి ఇన్స్యూరెన్స్ రాదు! ఇలాగ మిగిలిన కారణాలకి కూడా.  


ఒక బ్యాంకులో బోర్లు వెయ్యడానికో, బావులు తవ్వడానికో అప్పులు తీసుకున్నవాళ్ళు, పంట ఋణాలు తీసుకుంటే, ఆ బ్యాంకువాళ్ళేమి వ్రాస్తారు? ఆ భూమి వర్షాధారం కాదు--అనే కదా? యెక్కువ అప్పుకోసం ఇంకో పంట అని చెప్పిన వాళ్ళకి, ఆ పంట దెబ్బతిందని ప్రభుత్వం ప్రకటించకపోతే, ఇన్స్యూరెన్స్ రాదు కదా?  


అయినా, చోటా మోటా రాజకీయుల ప్రోద్బలం తో, 'పక్కవాడికి ఇన్స్యూరెన్స్ వచ్చింది--నాకెందుకు రాలేదు?' అని బ్యాంకు మేనేజర్లమీద దెబ్బలాడి, ధర్నాలూ అవీ చేసి, బ్యాంకులకి తాళాలు వేసిన సంఘటనలు కూడా వున్నాయి!  


ఇక బ్యాంకువాళ్ళేం చేస్తారు? అన్ని భూముల్నీ 'వర్షాధార ' అనే వ్రాసి, అక్కడ మామూలుగా యే పంట నాశనం అవుతూవుంటుందో, ఆ పంటనే వేసినట్టు వ్రాసేస్తున్నారు!  


అలా అనంతపురం జిల్లా మొత్తం 'వేరుశెనగ ' పంటే వేస్తారు, అన్నీ వర్షాధార భూముల్లోనే వేస్తారు, ఆ కొండలమీదా గుట్టలమీదా యెలాగూ 30 నించి 70 శాతం నష్టం వస్తుంది--అందరికీ కొద్దో గొప్పో ఇన్స్యూరెన్స్ వస్తుంది!  


ఇవండీ మన పంట విస్తీర్ణం లెఖ్ఖలు!  


ఇక ధరల పెరుగుదలకి మిగతా కారణాలగురించి మరోసారి.





Sunday, August 30, 2009

మన తెలుగుతల్లి


గలగలా కృష్ణమ్మ


అగస్థ్య మహర్షి వింధ్య పర్వతం తలవంచి దక్షిణ భారతానికి వచ్చాక, తన కమండలం లోని నీటిని నర్మద, తపతి, మహానది, కృష్ణ, తుంగభద్ర, కావేరి--ఇలా వివిధ నదులుగా ప్రవహింపచేసి, తిరిగి సముద్ర ప్రవేశం కల్పించాడు!  


కాని, మన కృష్ణమ్మ విజయాద్రి (అర్జునుడు పాశుపతం కోసం తపస్సు చేసిన కొండ), ఇంద్రకీలాద్రి లని సమీపించి, అవి చాలా యెత్తుగా వుండడంతో, అక్కడ ఆగిపోయింది--ఆ భూమంతా పెద్ద జలాశయంగా మారిపోయింది!  


అప్పుడు మళ్ళీ అగస్థ్యుడు అక్కడికి చేరి, శ్రీ కనకదుర్గమ్మని తన ముక్కెర యెరువడిగి, దాంతో విజయాద్రి కి చిన్న 'బెజ్జం' చేశాడు! 


అందులోంచి కృష్ణమ్మ హడావిడిగా వెల్లిపోబోతే, దుర్గమ్మ ముక్కెర కొట్టుకుపోయింది! వెంటనే, కృష్ణమ్మ తన ముక్కెర దుర్గమ్మకి ఇచ్చి, 'అక్కా మళ్ళీ నీదగ్గరికి వచ్చినప్పుడు ఇద్దూగాన్లే!' అంటూ వెళ్ళిపోయింది!  


ప్రవాహ వేగానికి విజయాద్రి రెండుగా చీలిపోయింది! 


దుర్గాంబ కొండా, విజయాద్రి క్రింద వెలసిన వూరే 'బెజ్జం వాడ ', తరవాత 'బెజవాడ ', నేటి 'విజయవాడ '!  


ఆ బెజ్జం మధ్యలోనే, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నేటి 'ప్రకాశం బరాజ్' నిర్మించారు!  


కృష్ణమ్మ తన ముక్కెర అడగడానికి దుర్గమ్మనెప్పుడు సమీపిస్తుందో, అప్పుడే 'కలియుగాంతం' అవుతుందట!  


అదీ సంగతి!

Monday, August 10, 2009

గోముఖమూ...గోదావరీ...గోష్పాదమూ

గోదావరి
పాపికొండల్లోని గురవాడ రిజర్వాయరు యెంత యెత్తులో వుందో తెలుసా? సాక్షాత్తూ సముద్ర మట్టం నించి 765 మీటర్లు (ట)! (అంటే 2,500 అడుగులకు పైగా!)
గోదావరి గురించీ, పాపి కొండల గురించీ, పట్టి సీమ గురించీ ఓ ఇతిహాసం ప్రాచుర్యం లో వుంది.
గౌతమ మహర్షి కొవ్వూరు (గోవూరే కొవ్వూరుగా మారిందట) దగ్గర వున్న ‘గోష్పాద క్షేత్రం’ లో ఆశ్రమం కట్టుకొని, తపో సాధన చేస్తూ వుండేవాడట!
ఆయన రోజూ వుదయమే సంధ్యావందనం పూర్తయ్యాక, కమండలం లోని నీళ్ళలో తడిపి, ఓ గుప్పెడు ‘అక్షతల’ని ఆశ్రమం పక్కనే చల్లుకొని, తపస్సాధనలోకి వెళ్ళిపోయేవాడట!
మధ్యాన్నం అయ్యేసరికి, చక్కగా ఆయనకి సరిపడా వరి ధాన్యం పండేవట! వచ్చే బియ్యం తో భోజనం కానిచ్చేవాడట!
ఆరోజుల్లో ఆ ప్రాంతమంతా దట్టమైన అడవిగా వుండడంతో, ప్రజలకి పంటలు పండించుకోడానికి జలవనరేమీ లేక, వాళ్ళు కొంతమంది మునులనీ వాళ్ళనీ ఆశ్రయించి, పరిష్కారమయ్యేలా ప్రార్థించారట! వాళ్ళు ఆ కోరికతో ఇంద్రుడి శరణుజొచ్చారట! ఆయన హామీ ఇచ్చేశాడు!
ఓ రోజున మధ్యాహ్నం గౌతముడు కళ్ళు తెరిచేసరికి ఓ గోవు (ఇంద్రుడు) ఆయన వరికంకులని భోంచేస్తోందట! పాపం గౌతముడు చేతికందిన ‘తృణాన్ని’ దాన్ని అదిలించడానికి విసిరితే, ఆ గోవు అమాంతం చచ్చిపడిపోయిందట!
గౌతముడు ఖిన్నుడై, గోహత్యా పాతకం నించి యెలా విముక్తుడవ్వాలని ఆలోచిస్తూంటే, మునులందరూ ‘దక్షిణ గంగ’ ని తీసుకొచ్చి, ఆ గోవుని తడిపితే, అది పునర్జీవితమవుతుంది అని చెప్పారట!
ఇంకేం! గౌతముడు నాసికా త్ర్యంబకానికి వెళ్ళి, ఓ కొండమీద ఒంటికాలి మీద తపస్సు చేశాడట! వెంటనే దక్షిణ గంగ గోముఖం నించి ధారగా వచ్చి, గౌతముణ్ణి దారి చూపించమందట—ఆయన వెనకాలే వచ్చేసిందట!
కానీ—గురవాడ వచ్చేటప్పటికి, ఓ పెద్ద కొండ గోడలా అడ్డం నిలబడి వుందట! ఇక సాగలేక అక్కడే ఆగిపోయిందట—దక్షిణ గంగ! మరి గౌతముడి పాతకం తొలగేదెలా?
అందుకని ఆ మహర్షి ఆ కొండని వుద్దేశించి, “ఓ పాపీ! దారి విడువు” అని ఆఙ్ఞాపించాడట! వెంటనే ఆ కొండ తలవొంచి, తన పాపిడి గుండా ప్రవాహాన్ని వెళ్ళమందట! ఆ ప్రవాహ వేగానికి ఆ కొండ రెండుగా చీలిపోయి, ఇప్పటి పాపికొండలు యేర్పడ్డాయట! (వీటిని పాపిడికొండలు అని కూడా అనేవారు!
సరే—దక్షిణగంగ పాపి కొండ అడ్డంకి దాటింది—కానీ, అక్కడ లోయ పల్లంగా వుండడం వల్ల అక్కడ నిలబడిపోయిందట!
అప్పుడు గౌతముడు తన దగ్గర వున్న—క్షేత్రాన్ని దున్నడానికి చేతి తో వుపయోగించే ‘పట్టిసం’ తో క్రిందికి మార్గం చేసాడు—దాంతో మళ్ళీ ప్రవహించి, గోష్పాద క్షెత్రాన్ని పావనం చేసి, గోవుని బ్రతికించింది! పట్టిసం తో మార్గం చేసిన చోటే ‘పట్టిస క్షేత్రం’. దాన్నే ఇప్పుడు పట్టి సీమ అంటున్నారు!
అక్కడ నించి, గౌతముడి విఙ్ఞప్తి మేరకు ఇతరులు కూడా కలిసి, ఆ గంగని సప్తర్షులూ యేడు పాయలుగా తీసుకెళ్ళి సముద్ర సంగమం చేయించారు! దాంతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారింది!
తరవాత మహానుభావుడు ‘సర్ ఆర్థర్ కాటన్’ బ్యారేజి నిర్మించడం, ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణగా చెయ్యడం—జగద్విదితం!
అదీ సంగతి!
(కృష్ణమ్మ గురించి మరోసారి)

Sunday, August 9, 2009

మ. వి.

జర్నలిస్టులు
మన మీడియా కనిపెట్టిన ‘ముస్లిం సోదరులు’ లా, వీళ్ళది ఓ ప్రత్యేక జాతి!

వీళ్ళు యెక్కడికైనా, యే సమయం లో అయినా, యెప్పుడైనా వెళ్ళవచ్చు—యేమైనా చెయ్యవచ్చు. వీళ్ళకి కూడా ప్రభుత్వం చౌకలో ఇళ్ళస్థలాలు కేటాయించడం లాంటి కొన్ని సదుపాయాలు వున్నాయి!

మన రాజకీయ నాయకులు యెదేదో మాట్లాడేసి, మరో గంటలో మాట మార్చి, ‘నేనన్నదాన్ని వక్రీకరించారు’ అని డబాయించడానికి అవకాశం ఇస్తున్నది వీళ్ళే!

ఇదివరకు జర్నలిస్టులు ఖచ్చితం గా ‘షార్ట్ హాండ్’ నేర్చుకొని, మాట్లాడుతున్నవాళ్ళు మాట్లాడుతూ వుండగానే వ్రాసేసుకొని, దాన్నే రిపోర్ట్ చేసేవారు!

మరిప్పుడో? ప్రెస్ కాన్ ఫరెన్స్ కి పిలిస్తే (పెన్నులూ, పుస్తకాలూ, జీడిపప్పు పలహారాలూ, కూల్ డ్రింకులూ, కొండొకచో హాట్ డ్రింకులూ అనివార్యం గా సరఫరా చెయ్యబడతాయి) చెపుతున్నది వింటారు—కానీ వ్రాసుకోరు! (విన్నవి కూడా ఈ చెవులోంచి ఆ చెవులోకే ప్రయాణిస్తాయి అంతే!) చివరికి మొదటి నించీ గబగబా బరికేస్తున్న ఉత్సాహవంతుడైన ఓ యువ జర్నలిస్ట్ ని అసలు విషయమేమిటి అని అడిగి, వాళ్ళకర్థమయిందాన్ని ఓ పది పన్నెండు పడికట్టు పదాలతో అల్లేసి, రిపోర్టు చేసేస్తారు!

వీళ్ళలో ప్రముఖ పత్రికలకి పనిచేసేవాళ్ళూ, చిన్నా చితకా పత్రికలకి పనిచేసేవాళ్ళూ అంటూ మినహాయింపులేమీ వుండవు!

ఉదాహరణకి, మొన్న 6, 7 తేదీలలో బ్యాంకు వుద్యోగులందరూ తమ దీర్ఘకాలం గా అపరిష్కృతం గా వున్న కోర్కెల సాధనకై సమ్మె చేసారు!

దీని గురించి ప్రముఖ దిన పత్రిక ‘ఈనాడు ‘ విలేఖర్ల రిపోర్టులు ఇలా వున్నాయి—

మెయిన్ పేపరులో, సమ్మె ప్రకటించారనీ, సమ్మె చేస్తున్నారు అనీ, వాళ్ళ కోరికలూ—ఇలా కథనాలు వెలువరిస్తూనే వున్నారు—6 వ తారీఖున దేశవ్యాప్తం గా బ్యాంకులు మూతపడ్డాయి అని కూడా ప్రచురించారు!

మరి జిల్లా పేపరులో—ఒక ప్రాంత విలేఖరి—బ్యాంకు వుద్యోగులు ‘బంద్’ పాటించి, అన్ని బ్యాంకులనీ మూయించేశారు—అని వ్రాశాడు!

జిల్లా ముఖ్య పట్టణం లోని ఐ సీ ఐ సీ ఐ బ్యాంకుముందు ప్రదర్శన నిర్వహిస్తున్న వుద్యోగుల ఫోటో వేసి, ‘అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం’ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నట్టు యూనియన్ నాయకులు ప్రకటించారని ఆ విలేఖరి వ్రాశాడు. (అక్కడ ప్రచురించిన చిత్రంలో పెద్ద పెద్ద అక్షరాలతో ‘యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ అని వ్రాయబడిన బ్యానర్ స్పష్టం గా కనిపిస్తోంది!)

సమ్మె తరవాత, కోర్కెల గురించి చర్చిస్తామనో యేదో హామీ ఇచ్చారు అని వ్రాసిన వార్తలో కూడా, ఇలాగే ప్రచురించారు!

ఇలా అయితే యెలా!




Thursday, July 30, 2009

Banking

As already discussed, the employees of Banks were nothing but bonded labourers.

Besides the employees, there were a kind of contract workers like ‘Open Loan Representatives’, ‘Godown Representatives’ etc.

The Banks lend, keeping something as ‘Security’ for them so that if the borrower fails to repay the loan, they can fall back upon the Security and realize its value to obtain repayment of their loan.

For this, there are certain types of ‘charge’s on the Securities—like ‘Hypothecation’; ‘Pledge’, ‘assignment’, ‘Mortgage’ etc.

So the Banks take ‘charge’ of the ‘Security’ before lending, so that they can enforce their charge, if necessary, at a later date, if the loan is not repaid.

Generally ‘Open Loans’ are allowed against the charge ‘Hypothecation’.

This is a funny kind of charge—as under this charge, the ‘physical possession’ of the security is with the borrower, but its ‘ownership’ lies with the ‘hypothecatee’ i.e. the Bank!

So, how to have an effective control on the ‘hypothecated’ stocks? The Banks invented the system of ‘Open Loan Representatives’, who will be stationed at the borrower’s premises, supervise the movement of ‘stocks’ and if they are sold, see that the Bank’s share of the sale proceeds are deposited with the Bank!

For their remuneration, they were paid on daily/hourly basis, charging the same to the Customer’s account (Open Loan Borrower’s account)!

………to be continued.


Tuesday, July 28, 2009

Banking

The Banks’ main business, as everybody knows, is to collect (idle money from public through) Deposits and Lending them to the needy, earning margin as profit in the process. Besides, they also perform some Agency Services and General Utility Services.

Some of the Agency Services are Collection of cheques and other bills of exchange; Collection of Receivables like Rents etc., Payment of payables like Insurance premiums etc. for which they charge ‘commission’.

Some of the General Utility Services are Sale of Demand Drafts, Purchasing of cheques and other instruments, Discounting of Bills of Exchange etc. through which they earn ‘exchange’.

Thus the Banks are the nerve centre of financial activity in any country.

Some of the World Famous Banks were ‘The Westminster Bank’, ‘Lloyds Bank’, ‘British Bank of the Middle East’, ‘Chase Manhattan’, ‘Bank of America’, ‘Banque de Nationale Paris’ etc.

There were laws framed to govern the Banking practices in various countries and in
India, the Banks are governed by the Negotiable Instruments Act 1881, introduced by the British, in India.

The first Bank started in
India during the British regime was the Imperial Bank, which became, after Independence, State Bank of India, Now the Largest Bank in India. It has associate Banks viz. State Bank of Bikneer & Jaipur, State Bank of Hyderabad, State Bank of Indore, State Bank of Mysore, State Bank of Patiala, State Bank of Sourashtra & State Bank of Travancore.

Later many Banks came into existence and in the year 1969 the then big Banks viz. Allahabad Bank, Bank of Baroda, Bank of India, Canara Bank, Central Bank of India, Corporation Bank, Indian Bank, Indian Overseas Bank, New Bank of India, Punjab & Sind Bank, Punjab National Bank, Syndicate Bank, Union Bank of India, United Commercial Bank were Nationalised to become Government of India Undertakings.

During the early '80s, Five more Banks were nationalised viz. Andhra Bank, Bank of Maharashtra, Dena Bank, Oriental Bank of Commerce & United Bank of India, Vijaya Bank.

During the ‘90s, after introduction of Economic Reforms in
India, doors were opened for establishment of Private Banks and Foreign Banks to enter India. Some of the then Financial Institutions like HDFC, ICICI, UTI etc. became independent Banks and New generation Banks like Global Trust Bank etc. were opened. Many hundreds of Private Banks like Lord Krishna Bank, Krushi Bank, Charminar Bank etc. were also born. Foreign Banks like Citi Bank, Bank of America, Honkong & Shanghai Bank etc. entered and opened their branches in India.

During the late ‘90s, some of the Private Banks began going to The Wall and till now there is no recourse to their depositors. After these incidents, the Reserve Bank of
India has tightened its control by framing and revising the regulations regarding private Banks.

Besides, all the Banks in
India started going hi-tech, using large scale mechanization through computers and utilizing other Information Technology methods and in the new millennium started networking their branches. ATMs in large numbers are opened in every nook and corner of the country by all the Banks. Real Time Gross Settlement is introduced among Banks facilitating easy transfer of funds. As a further step, the Banks started going to Core Banking Solution and the need for inter-branch transfers is also avoided. Thus there is a quantum leap in the Banking industry in India.

(We will discuss the haphazardness of the IT-savvy-ness of the Banks later.)

Meanwhile, we may review the progress and other aspects of the Indian Banking Industry, since
Independence.

The Banking Business was carried on usually by the Banks in
India before independence the number of branches was very less, located in main Cities and big Towns in India. Competition among Banks was ferocious. The branches were controlled by ‘Agents’ with bear minimum number of Staff. They were empowered or we can say, usurped the power of giving concessions to attract business, both in Deposits and Advances and in Commissions and Exchange. To earn more, they used to ‘collect’ business throughout the day and made the staff to work throughout the night. Some people may not believe if they are told, the Agents punished the clerks and other staff members by caning them on their palms! Thus there born a joke where the Bank employees used to lament “my children do not know who their father is ! It is because, by the time I leave for work in my Bank, they are still asleep and when I return from my Bank after work, they fall asleep!”

It was in those days that the Communist Party of India started organizing the employees into Trade Unions and representing on their behalf before the Managements of Banks. Thus was born the “All India Bank Employees Association”. (AIBEA).

(This was my second post after I have become a serious blogger! What with my private, very slow internet connection and my primitive system, I did not think blogging was so easy! So then I was not a frequent visitor to the blog world! But now......! I want to continue the leftover subjects also and so......await my next posts!)




Sunday, July 5, 2009

‘Corporate Farming……?’

‘Co-operative Farming!’

Our Raja Sekhar Reddy is behaving as if his mental faculties have reached their maximum by declaring he wants farmers to adopt ‘Co-operative Farming’—as if it is his ‘Novel idea’!

In fact, years before independence, the concept was tried and proved a major failure after decades!

There is still ‘Circars Agricultural Development Corporation’ in West Godavari District, formed somewhere near 1940, in which the farmers in adjacent villages, comprising vast areas joined, with their lands as their share capital, obtaining shares according to the land they contributed to the corporation—say, one share for every 10 cents of land—and they carried on farming, as if they are not members of any corporation, sold their product, enjoyed the benefits, and remained members of the Corporation, ‘nam ke vaste!’.

But when they wanted to perform the marriage of their daughter, and wanted to sell their holding, it was not possible to sell their holding to outsiders! They were forced to sell their land to their neighbours, (often big land lords, who could not cajole them to sell their lands at their asked prices for years together, but remained patient vultures) at their (Land lords) asked prices, and leave the lands with moist eyes!

The Banks refused to finance for their agricultural operations, saying, they are not owners of the land! If they have to be financed, the Corporation officials have to sign the Documents for the loan as Co-obligants! When the farmers approached the officials of the Corporation, they reused saying, they could not mortgage the Corporation’s interests!

Did Mr. Raja Sekhar make deep study as to the repercussions? No!

But he is more enthusiastic to implement the scheme!

God only save the small farmers from the Corporate ‘Clutches’!


Thursday, June 25, 2009

'Hither thou........

.........Foot balls?'

Finally it is happening!

The 'al khaida' chief or some one says, 'we are going to take control of the nuclear weapons with the Government of Pakisthan........and we will aim them at America!'

'Hey! America! What are you doing? What is your CIA, FBI etc. are doing?

Can you identify "Whose 'Foot Balls' are under whose control?

What about "'America's', 'France's', 'Germany's', 'England's', 'Japan's' 'China's' 'South Korea's' 'India's', 'Pakisthan's, ...........for the matter, 'Drubboutti's"?

May be you are not at all competant! Let us entrust the task to 'Gestapo!'

Shall we?

Monday, June 8, 2009

Manmohan's Govt--2

1. Mr. Pranab Kumar Mukherjee—The main factor against him is his age. He is not able to comprehend what he has to talk within some minutes after he opens his mouth!

First, fiscal deficiet is staring in his face. He has to—

a. sell the Governments share in the PSUs (including the navaratnas—to which the Communists were opposing vehemently hitherto);

b. to contain the effects of economic depression, he has to spell out some more packages;

c. to take some more other steps, besides reducing repo & reverse repo rates, to bail out the economy;

d. to rationalize subsidies and remove control on oil prices;

e. to bring new things and services under the Tax net;

f. to increase FDI in Insurance, Retail Trade and Infrastructure sectors;

g. to permit investment of PF & Pension Funds in Equities

—all of which are double edged weapons—which may lead to his ousting as is the case with Chidambaram!

The Government Debt is around Rs.3,26,000 crores

—so he cannot resort to public pleasing steps like Debt waiver/Debt relief;

he has to spend around Rs.30,000 crores on National Rural Employment Generation Scheme—and he may have to cut down the same to some extant!

He cannot take things casually in the coming five years (God permit him be in the post so long) !

He may garner support from some quarters for selling of Government share in the PSUs but the other things are not easily possible.

He has already declared that the further packages will be in consonance with the further financial reforms.

He has also declared that his priority would be to restore the growth rate to at least 7%, and to improve job opportunities through manifold increase of outlay.

Hope he succeeds!

Sunday, June 7, 2009

'ఉతూతి...

భారత దేశం లో, చార్లెస్ శోభరాజ్; నట్వర్ లాల్ ల తరవాత అంతటివాడు మళ్ళీ రాలేదు అనుకుంటూండగానే, అశోక్ జడేజా వచ్చేశాడట!

అశోక్ జడేజా ఒక ఆయుర్వేద వైద్యుడు. వాళ్ళ అసలు ఇంటిపేరు ‘దిడావాలా’ ని ‘జడేజా’ గా మార్చుకున్నాడట.
బాబా అవతారం యెత్తాడట. తన తెగ వాళ్ళదగ్గర ‘మాతా వాహనావతి శికోతర్’ ఆశీస్సులతో చిన్న చిన్న మొత్తాలలో తాను సేకరించిన డిపాజిట్లని కొద్ది గంటలలో, రోజులలో రెట్టింపు చేసి తిరిగి అందించేవాడు!

డిపాజిట్లు పెరగడం ప్రారంభించగానే, తిరిగి చెల్లించే వ్యవధిని పెంచుతూ, మూడు రెట్లూ, నాలుగు రెట్లూ ఇస్తాననేవాడట!

ఈ రకం గా గుజరాత్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో 2000 కోట్లకు పైగా జనాలకి టోకరా ఇచ్చాడట!

బేడ్ లక్! మన దక్షిణాది వారు జాతీయ స్థాయిని అందుకోలేక పోయారు!

Saturday, June 6, 2009

Manmohan's Govt

Goal/s, ways & means for ‘Mind enticing’
Government!

At the outset, a government without crutches has formed at the Centre with ‘Man Mohan’ as the head and some others as the limbs! (happy to be without the Communists and others like Laloo & Paswan!) (But still dependant on Trinamool & D M K).

Let us look at the Goals and means of the new Government.

Staring at its face are :
>
1. Sustaining the growth rate at near 7%;
2. Enlarged Fiscal deficiet;
3. Declining ‘balance of payments’—Reduction in both Exports & imports;
4. Fruits of Reforms not reaching the equally to all (leave alone the ‘aam admee’);
5. Reaching the aspirations of the Voters who voted for him—and above all
6. Being in the good-looks of ‘Soniya’!

For this he has chosen, mainly,

1. Mr. Pranab Kumar Mukherjee,
2. Mr. Sharad Pawar,
3. Mr. Anand Sharma, and
4. Mr. Kamalnath—as Finance Minister, Food & Agriculture Minister, Commerce Minister and Infrastructure Development Minister respectively.

Hope he will be successful! (Soniya is already satisfied!)

Sunday, May 31, 2009

Oil Prices & Profits

Of late, the Oil Companies in India are crying wolf about the subsidies/prices and losses on Petrol, Gas, Diesel, Kerosene, Naphta etc.!

Now the cat is out of the bag--they have declared huge profits for the last quarter of the previous financial year!

But now the Government says, it will decontrol the prices of the oil and oil products!

To help whom?

It says it will interfere only when the rate per barrel of crude crosses a certain level!

If it remains just below the level, and the oil companies go on raising their prices, what is the fate of consumers and the economy?

G O K!

Tuesday, May 26, 2009

‘ఉతూతి…..’

నిన్న అనుకున్నట్టు 4 కోట్లు కాదట—రాష్ట్ర వ్యాప్తంగా 40 శాఖల ద్వారా సుమారు 15 వేల మంది నుంచి—7 కోట్లవరకూ యెత్తుకుపోయినట్టు పోలీసు దర్యాప్తులో తేలిందట!

విజయవాడ ప్రథాన కేంద్రం గా, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, విసాఖపట్నం, విజయనగరం, గుంటూరు వంటి ప్రముఖ నగరాలతోపాటు సమీప పట్టణాలలో కూడా మహిళలూ, నిరుపేదలూ, సామాన్యుల నించి వసూళ్ళు చేసి ముంచిందట!

దీన్ని ఈనాడు—ఈ టీవీ బయటపెట్టింది!

వుండవిల్లి అరుణ్ కుమారూ! యేమి చేస్తున్నావు? ముథూట్, మణుప్పురం—ఇలాంటివి కూడా నీకు కనిపించడం లేదా?

అసలు అన్నవరం లాంటి బోగస్ సంస్థల్ని పెంచి పోషిస్తున్న ‘మహిళలూ, నిరుపేదలూ, సామాన్యులూ’ ఇలా యెందుకు చేస్తున్నారు?

కొంత ‘సులభ నగదు’ (ఈజీ మనీ) సంపాదించి, దాన్ని మరింత సులభ నగదు ద్వారా పిల్లలు పుట్టించి, పెంచుకోవాలని! (యెవరన్నారు భారత్ పేద దేశమని?)

ద్రవ్యోల్బణం యెందుకు వస్తోందో తెలుస్తోందా? (ప్రభుత్వ లెక్కల్లో కాదు—ప్రజల ఇక్కట్లలో)

పోయిన ఎలక్షన్ల పుణ్యమాని, ప్రతీ అభ్యర్థీ పరిమితికి లోబడే ఖర్చు పెట్టినా, కొన్ని వందల కోట్లు ప్రజలకి పంచిపెట్టబడింది—ఇది కేవలం చట్టబద్ధంగా! ఇక చట్టవిరుద్ధం గా సంగతి మనం మాట్లాడుకోనఖ్ఖర్లేదు!

తుమ్మల కిషోర్ అంటాడూ—బ్యాంకులు ఒకదాంట్లో ఒకటి విలీనమైపోయి, బ్యాంకుల్లో ప్రభుత్వ పెట్టుబళ్ళు 51 శాతం కన్న బాగా (యే 29 శాతానికో) తగ్గిపోయి, పబ్లిక్, ప్రైవేటు విడుదలల ద్వారా మరిన్ని లక్షల కోట్లు సేకరించి, అతి తక్కువ వడ్డీకి అందరికీ అప్పులిచ్చేస్తే బాగుంటుంది—అని! (ఆ మొహమాటం యెందుకు? వడ్డీ లేకుండా అంటే ఇంకా బాగుంటుందికదా!) అన్నట్టు, ఈయనకి వ్యాసం తరవాత ఇన్నాళ్ళూ లేని ఓ తోక తగిలించారు—‘రచయిత బ్యాంకింగు రంగం లో నిపుణుడు’—అని!

నిజం రామోజీరావుకీ, మీకే తెలియాలి మరి!

Monday, May 25, 2009

‘ఉతూతి…….!’

నేనంటూనే వున్నానుగా—ఉతూతి ఫైనాన్స్ లు పెరిగి పోయాయని!
అరవ్వాళ్ళు అన్నీ ‘తిరపతి’ కి సంబంధించిన పేర్లు (గోవిందా ఎంటర్ప్రైజెస్ లాంటివి), యెన్నుకుంటే మన తెలుగు వాళ్ళు ‘అన్నవరం’ యెన్నుకున్నారు!

బొండాడ మాణిక్యాలరావు విజయవాడ లోని అన్నవరం అగర్ బత్తీ సంస్థ తరుఫున, 5 వేలు, అంతకు మించి డిపాజిట్ చేస్తే, నెల నెలా వడ్డీ తో పాటు ఉపాధి కూడా కల్పిస్తామన్నాడట.
కొంతకాలం అగర్ బత్తీలూ, ప్యాకింగ్ సామాగ్రి ఇచ్చి, ప్యాకింగ్ చేసిన పెట్టెలని తీసుకొని, కూలి ముట్ట చెప్పేవాడట. తీరా నెల వడ్డీ అడిగితే, రేపు, మాపు అని తిప్పాడట!

వాళ్ళు వసూలు చేసిందెంతో తెలుసా? భీమవరం చుట్టుపక్కలా, జిల్లా మొత్తం మీదా—షుమారు ‘నాలుగు కోట్లు!’

ఈనాడుకి అనుమానమొచ్చి బయటపెడితే, ఆడాళ్ళు వాడిని బాదెయ్యబోతే, పోలీసులు వెంటనే అరెష్టు చేశారట! (నేరస్తుల్ని పట్టుకోమంటే ఆలస్యం చేస్తారుగానీ మన పోలీసులు, నేరగాళ్ళని ఆదుకోడానికి లిప్తపాటు కూడా ఆలస్యం చెయ్యరు!—దకా!)

మరి ఇవాళ ‘మణుప్పురం’ 14% వడ్డీకి బంగారం మీద గ్రాముకి ఇచ్చేదెంతో తెలుసా?
అక్షరాలా 1363 రూపాయలు!

మరి వీళ్ళకెంతమంది బలౌతారో!

Thursday, May 21, 2009

తాజా వార్త

……….యేమిటంటే, మన కళైఙ్గర్ ‘మీ మంత్రివర్గం లో మేము చేరం పొండి’ అని చెప్పేశాడుట! (తను అడిగినన్ని మంత్రి పదవులు ఇవ్వలేమన్నారు కాబట్టి—అని పండితుల విశ్లేషణ!)

పాపం ఆంధ్రావాళ్ళు క్రితంసారి తొంబలుగా ఎంపీలని గెలిపించినా, ఒక్క కేబినెట్ మంత్రి పదవీ ఇవ్వలేదు, ఈ సారైనా ఒకటో రెండో ఇవ్వకపోతే, రాశ్శేఖర్రెడ్డి రాష్ట్ర ప్రజలకి ముఖం చూపించలేడు—మూడోసారి నెగ్గడం అనుమానమైపోతుందేమో అని సోనియా, “కరుణాజీ, మీరడిగిన ‘తొమ్మిది’ కాదు, మరో మాట చెప్పండి” అని అడిగి వుంటుంది.

మరి తమిళ ఆత్మగౌరవం యేమవ్వాలి? “ఇస్తే తొమ్మిదీ ఇవ్వండి, మేమడిగినవే ఇవ్వండి—లేకపోతే లేదు” అని తెగేసి చెప్పి, “మేమసలు మంత్రివర్గం లో చేరం!” అని ప్రకటించేశాడు కరుణ!

చూద్దాం, ఈ బింకాలు యెన్ని గంటలపాటు వుంటాయో!

మన రాశ్శేఖర్రెడ్డి యెంతవరకూ ‘ఆత్మగౌరవాన్ని’ నిలబెట్టుకొని, తెలుగువాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెడతాడో!

సెన్సెక్స్ ఓ పెరిగిపోతోంది! మళ్ళీ ‘రియల్’ బూ ం (మన రాష్ట్రం లో) వచ్చినా రావచ్చు! భూములెలాగూ మిగల్లేదు, అసెంబ్లీ హాలూ, జూబిలీ హాలూ, రవీంద్ర భారతి, హుస్సేన్ సాగరూ, పబ్లిక్ గార్డెన్సూ అయినా మిగులుతాయో, పందేరం చేసేస్తారో! చూడాలి!

యేమైనా, మన ‘చిరు’ చేసింది చిరు తప్పిదం కాదనీ, ‘చారిత్రాత్మక తప్పిదం’ అనీ అనిపించడం లేదూ?

మన జేపీ మరో ‘లోక్ నాయక్’ అయితే యెంత బాగుండును!—అనిపించడంలేదూ?

ఆలోచించండి!

Tuesday, April 28, 2009

పచ్చి మోసం

"చేతులు కాలాక…….

………..ఆకులు పట్టుకోవడం" మన భారతీయులకీ, ముఖ్యం గా తెలుగు వాళ్ళకీ బాగా అలవాటే!

“ఓ వుండవల్లి అరుణ కుమార్! ఓ జక్కంపూడి రామ్మోహన రావూ! ఈ ‘మణుప్పురం’, ఈ ‘ముథూట్ ఫైనాన్స్’ ల గురించి మాట్లాడరేమి (రా!)

రామోజీ రావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ ద్వారా జమ కట్టుకున్న ప్రతీ పైస తిరిగి చెల్లించినా, ‘నిబంధనలకి విరుద్ధంగా వసూలు చేశారు’ అంటూ ఓ గోల చేసారే!

మరి వీళ్ళు “యే నిబంధన ప్రకారం ‘గోల్డ్ లోన్’, ‘ఫైనాన్స్’ సాగిస్తున్నారో మీకేమైనా పట్టిందా?

పక్క పెంకుటింట్లో వుండే ఒకాయన మేడలో వున్నా ఒకాయన దగ్గర ‘అత్యవసరం గా అవసరం వచ్చింది, ఈ బంగారు గొలుసు మీ దగ్గరుంచుకొని, ఓ మూడు వందలు ఇప్పించండి’ అంటే, ఆ మేడాయన జాలి పడి, ప్రో నోటు వ్రాయించుకొని, గొలుసు తీసుకొని, ఆ మూడు వందలూ అప్పిస్తే, తరవాత—కొన్నాళ్ళకి ‘నువ్వు పాన్ బ్రోకరు లైసెన్స్ లేకుండా బంగారం తాకట్టు వ్యాపారం చేస్తున్నావు’ అని ప్రభుత్వం ‘అరెస్ట్’ చేసింది!

మరి ఈ ‘మణుప్పురం’, ‘ముథూట్’ లకి కనీసం పాన్ బ్రోకర్ లైసెన్స్ అయినా వుందా?

* * *

ఓ ముప్ఫైయ్యేడేళ్ళ క్రితం, ఓ ‘స్కీము’ వచ్చింది! (పెట్టింది అరవ్వాళ్ళే అని వేరే చెప్పాలా?)

ఓ కాయితం మీద

సీ. నెం. పేరు, అడ్రెస్ నగదు (రూ.)

1. విళ్ళుప్పురం రామనాథన్ 1/-
2. రామనాథన్ కృష్ణన్ 1/-
3. రామనాథన్ వాసంతి 1/-
4. వేల్వెట్టిపురం వేలుపిళ్ళై 1/-
5. వేలుపిళ్ళై పిరభాకరన్ 1/-

ఇలా ప్రింటు చేయించి, అందరికీ కవర్లలో పోస్టులో పంపేవారు!

మనం చెయ్యవలసిందల్లా నెం. 5 స్థానంలో వున్న పేరు తొలగించి, మన పేరూ, అడ్రెస్ వ్రాసి, మనకి తెలిసున్నవాళ్ళందరికీ పంపించాలి! అంతే!

ఇంతకుముందు ఇంకోపని చెయ్యాలండోయ్! మన పైనున్న నలుగురు పేర్లకీ అక్కడ వ్రాసిన అడ్రెస్ లకి ఒక్కొక్క రూపాయి ‘మణియార్డరు’ చెయ్యాలి!

(యెక్కడైనా ఈ గొలుసు తెగి పోతే……..మీకింక మణియార్డరులు ఆగిపోతాయి…..అని ఓ వార్నింగ్ కూడా!)

ఇలా, ఆ నలుగురికీ, వాళ్ళెంతమందికి ఆ కూపన్లు పంపించి వుంటే అన్ని రూపాయల చొప్పున మణియార్డరులు అందేవి!

వాళ్ళతో పాటూ, మనకీ, మనం యెంతమందికి పంపిస్తే, అన్ని రూపాయలూ మణియార్డరు ద్వారా అందేవి!

మా కొండబాబు ఈ స్కీము గురించి చెప్పగానే, నేను ‘ఓ పిచ్చి బాబూ, గొలుసు తెగకుండా, పైనున్న ఒక్క పేరూ వుంచి, మిగతా నాలుగు పేర్లూ మన ఫ్రెండ్స్ వి ఇచ్చెయ్యి’ అన్నాను!

అలా ఓ పాతిక రూపాయలు అందరూ సంపాదించిన గుర్తు!

తరవాత గొలుసు తెగిపోయింది! (కారణం మీరు ఊహించండి!)

అవే రోజుల్లో, డాక్టర్ మహీధర రామ మోహన రావు (నళినీ మోహన రావా?—వీళ్ళిద్దరూ అన్నదమ్ములనుకొంటా—ఒకాయన లెఖ్ఖల గురించీ, ఒకాయన సైన్స్ గురించీ వ్రాసేవారు.) ఆంధ్ర పత్రిక వీక్లీ లో “మనీ సర్క్యులేషన్—పచ్చి మోసం!” అనే వ్యాసం వ్రాశారు!

అది చదివితే తెలిసింది—ఇది యెంత భయంకరమైన మోసమో!

మీకు వెలిగిందా?

(మిగిలింది తరవాత!)

Friday, April 17, 2009

"ఉతూతి" బ్యాంక్

"ఉతూతి" బ్యాంక్

‘అరవం! అరవం!’ అంటూ అరిచే ఈ అరవ్వాళ్ళున్నారే—అసాధ్యులు!
యెదటివాళ్ళ బలహీనతలమీద చక్కగా ఆడుకోగలరు!

అందుకే తెలుగువాళ్ళు తొంబలుగా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులని యెన్నుకున్నా, ముష్టి మంత్రి పదవులు తెలుగు వాళ్ళకీ, మంచివన్నీ అరవ్వాళ్ళకీ దక్కాయి!

అరవ్వాళ్ళ గురించి పాప్యులర్ జోక్ అందరికీ తెలిసిందే!

అమెరికా వాడు చంద్రుడి మీద కాలు పెట్టగానే, ‘వేడి వేడి కాఫీ కావాలా సార్’ అంటూ యెదురొచ్చాడట—అప్పటికే అక్కడ ఓ సాంబారు హోటల్ యేర్పాటు చేసిన తమిళ తంబి!

ఇంక మనవాళ్ళ విషయానికొస్తే అరవ్వాళ్ళు పెట్టిన ‘గోవిందా ఏజన్సీస్’ అయినా, ‘సప్తగిరి ఎంటెర్ప్రైజస్’ అయినా, వెంటనే డబ్బులు కట్టేసి, ‘వాటికి పిల్లలు యెప్పుడు పుడతాయా’ అని యెదురు చూస్తూ వుంటారు! (తరవాత వాళ్ళ నెత్తిన చెంగు వేసినా, మొదట లాభపడ్డవాళ్ళు మళ్ళీ ఇంకోదానికి తయారు!)

ఇంకా చెప్పాలంటే, అదేదో సినిమాలో ‘ఉతూతి బ్యాంక్’ పెట్టినట్టూ, ‘అమృతం’ టీవీ సీరియల్లో ‘రిసీప్ట్’ కౌంటెర్ లో డబ్బు కట్టి, రసీదు ‘పేమెంట్’ కౌంటెర్ లో చూపిస్తే ‘రెట్టింపు డబ్బు’ ఇస్తారన్నా నమ్మేస్తారు!

‘మణుప్పురం’ గోల్డ్ లోన్; ‘ముథూతి ఫైనాన్స్’—సారీ ‘ముథూథ్ ఫైనాన్స్’ లాంటి వ్యాపార సంస్థలు ఈనాడు పేపర్లో, మొదటి పేజీలో పావు పేజీ ప్రకటనలు ఇస్తున్నారు—‘గ్రాముకి రూ.1,325/-‘ ఇస్తాము—ఇలాగ!

నిన్న వైజాగ్ లో బంగారం రేటు గ్రాముకి రూ.1,355/-. తణుకు లోనూ, నరసాపురం లోనూ గ్రాము రూ.1,325/-!

మరి వాళ్ళు గ్రాముకి రూ.1,325/- లోను ఇచ్చేస్తే, రేపు బంగారం రేటు తగ్గితే, వాళ్ళ పరిస్థితేమిటి?

(అలా మనం ఆలోచిస్తాము!)

కానీ, వాళ్ళు, యేరోజుకారోజు వచ్చిన బంగారాన్నంతా వాళ్ళ తమిళనాడుకి తరలించేస్తున్నారు! (మీరు విడిపించడానికి వచ్చినప్పటి మాట కదా!)

ఈ మధ్య, ఎలక్షన్ హడావిడిలో పోలిసులు ఓ కారు లో తరలిస్తున్న బంగారాన్నీ, లక్షల్లో వున్న నగదునీ పట్టుకొంటే, అందులో వున్నాయన ‘నేను ఫలానా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజరుని, మా ఇంకో బ్రాంచికి తరలిస్తున్నానూ’ అన్నాడట!

మరి పోలీసులు, ‘ఎస్కార్ట్ లేకుండా, గార్డులు లేకుండా, యే బ్యాంకూ ఇలా తరలించదు’ అన్నారట!

వింటే ఇది ‘ఉథూత్’ ఫైనాన్స్ యేమో అనిపించడంలేదూ?

మరి ఇక తెలుగు ప్రజల్నీ, వాళ్ళ బంగారాన్నీ ఆ దేవుడైనా రక్షించగలడా?

చూద్దామండి!

Friday, February 27, 2009

వృద్ధి

మన బ్యాంకులు దివాళా యెత్తకుండా మన పెద్దలు తీసుకున్న జాగ్రత్తల్లో కొన్ని—సీ ఆర్ ఆర్, ఎస్ ఎల్ ఆర్, బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్—ఇలాంటివి

వీటిగురించి స్థూలం గా చెప్పుకొంటే—

ముఖ్యంగా బ్యాంకులు ప్రజల దగ్గరనించి డిపాజిట్ల రూపం లో సేకరించిన నిధుల్లో, ఖచ్చితంగా ఇంత శాతం అని, ‘నగదు రూపం లో’ రిజర్వ్ బ్యాంకు దగ్గర వుంచాలి. దీన్ని కేష్ రిజర్వ్ రేషియో (సీ ఆర్ ఆర్) అంటారు.

తరవాత, యెప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకోవడానికి వీలుగా, ఇంకొంత శాతం సెక్యూరిటీల రూపం లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిలవ వుంచాలి. దీన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ ఎల్ ఆర్) అంటారు.

బ్యాంక్ రేట్ ఇప్పుడు అమల్లో లేదు అనుకున్నాం కదా.

ఇక రిపోజిటరీ అనేదొకటి స్థాపించింది మన రిజర్వ్ బ్యాంక్.

బ్యాంకుల దగ్గర ఎస్ ఎల్ ఆర్ కి కావలసిన దానికన్నా యెక్కువ సెక్యూరిటీలు వుంటే, వాటిని రిపోజిటరీ లో దాఖలు చేసి, నగదు అప్పు తీసుకోవచ్చు. దానికి కొంత వడ్డీ వసూలు చేస్తుంది రిజర్వ్ బ్యాంక్. అదే రెపో రేట్.

సెక్యూరిటిలు తక్కువైతే, నగదు చెల్లించి, సెక్యూరిటీలని అప్పుగా పొందవచ్చు. దీనికీ కొంత వడ్డీ వసూలు చేస్తుంది ఆర్ బీ ఐ. అదే రివర్స్ రెపో రేట్.

సీ ఆర్ ఆర్ నీ, ఎస్ ఎల్ ఆర్ నీ నిలబెట్టుకోడానికి రెపోజిటరీ వెసులుబాటు కల్పిస్తుందన్న మాట.

ఈ రేట్లు తగ్గించడం ద్వారా ఆర్ బీ ఐ కొన్ని వేల కోట్ల నగదు ని బ్యాంకుల కి ఋణాలివ్వడానికి వీలుగా అందుబాటులో వుంచుతోంది!

దాని వల్లే ఋణాల మీద వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ప్రజల డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు తగ్గి పోయాయి!
మరి కృత్రిమంగా ఇలా వుంచడం అవసరమా?

ద్రవ్యోల్బణం బాగానే తగ్గింది. కానీ ఈ యెన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది ‘వృద్ధి రేటు’ గురించి! అంచనాలు యెనిమిదికీ, యేడుకీ తగ్గి, ఇంకా తగ్గేలా వున్నాయి మరి!

ఈ సందర్భంలో నిన్న యూ ఎస్ అధ్యక్షుడు ఒబామా వాళ్ళ చట్ట సభలో చేసిన ప్రసంగానికి ప్రతిగా, ప్రతిపక్ష హోదాలో శ్రీ బాబీ జిందాల్ ప్రసంగం లోంచి ఈ మాటల్ని గమనించండి.

“మనదగ్గర లేని డబ్బుతో, మనకు అవసరం లేని వస్తువులను కొనడానికి ఋణాలెందుకు తీసుకోవాలి?”

వజ్ర సమానమైన, వజ్ర సదృశం అయిన, వజ్రోపమానమైన—ఇలాంటి విశేషణాలెన్నో వెయ్యదగ్గ మాటలు కావూ ఇవి?

మన ప్రధాన, మాజీవిత్త, తాత్కాలిక విత్త మంత్రులు గమనిస్తున్నారా?

Monday, February 16, 2009

ఆర్ధిక మాంద్యం

ఆర్ధిక మాంద్యం


……పుణ్యమాని, ఓ కంపెనీ అధిపతి శుబ్భరంగా దొంగతనాలు చేసేస్తున్నాడుట!
ఏకంగా ఓ బ్యాంకుకి కన్నం వేస్తూ పట్టుబడ్డాడట! (ఈనాడు 16-02-2009 పేజి నెం.5)

ఫ్రీ సర్వీస్!


ఇంకో ఆర్ధిక మాంద్యానికి సంబంధించిన వార్త—పరిస్థితుల వల్ల ఉద్యోగాలు ఊడిపోయిన మహిళలకి యేకంగా ఇంటర్నెట్ లో ప్రకటనలిస్తున్నారట—నాతో సెక్స్ కి అభ్యంతరం లేక పోతే, అద్దె లేకుండా మా ఇంట్లో మీరు వుండవచ్చు—అని!
బాగుందా?

Sunday, February 1, 2009

మూడేం ఖర్మ? మూడొందల తొంభయ్యారు!


తాజాగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకి పాకేజ్ ఇస్తానంటాడు మన ప్రధాన/ఆర్ధిక మంత్రి. రిజర్వ్ బ్యాంక్ గవర్నరు! (వెనకాల హోం మంత్రి ప్రోద్బలం చాలా వున్నట్టుంది!)

(ఈ అరవ్వాళ్ళేకదా గోవిందా ఎంటర్ ప్రైజెస్ లాంటివి స్థాపించి మన తెలుగోళ్ళ నెత్తిన చెంగేసింది? ఈ రోజుక్కూడా, 'మళ్ళప్పురం ఫైనాన్స్ 'లాంటి పేర్లతో 'మీ బంగారం తనఖాపై నూటికి నూరు శాతం ఫైనాన్స్ ' అని ప్రకటనలిస్తున్నది? రేప్పొద్దున్న, బంగారం రేటు పెరిగిన తర్వాత, వాళ్ళు మాయం అయిపోతే, మన బంగారానికి దిక్కెవరు?)

మన ఆర్ధిక వ్యవస్థ కి పట్టిన గ్రహణం—ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలూ, తామరతంపరగా వెలసిన ‘మైక్రో ఫైనాన్స్ ‘ కంపెనీలూ! ఇంకా, మ్యూచువల్ (వెఱ్ఱి వెఱ్ఱి) ఫండ్సూ!

వీటికి తోడు, బ్యాంకులూ! మహిళా సంఘాలకి లక్షలు లక్షలు అప్పులు ఇచ్చేస్తున్నాయి!
‘మన మహిళలందరూ లక్షాధికారులు కావాలి—పావలా వడ్డీ తో’ అనే మన ముఖ్య మంత్రీ!

మొన్నొకరోజు, పొద్దున్నే మా యింటిదగ్గరున్న కిరాణా కొట్టుకి వెళితే, దగ్గర్లో వున్న గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అడుక్కొనే చింపిరిజుట్టు మహిళ, చంకలో యేడాది బిడ్డతో, జాకెట్లోంచి ఓ మురికిపట్టిన నలిగిన పదిరూపాయల నోటు తీసి ఇచ్చి ‘ఓ క్లినిక్ ఆల్ క్లియర్ డబ్బా ఇవ్వండి’ అంది దుకాణదారుని!

ఆసక్తి చంపుకోలేక అడిగాను, ‘అమ్మా! నీకు చింపిరి జుట్టు లేకపోతే, యెవరు ముష్టి వేస్తారు?’ అని!

నన్ను గుర్తించినట్టుంది—“బాబుగారూ! మీరా! ఇవాళా, రేపు నాకు సెలవిచ్చేశారండి! (సంఘం వాళ్ళు) చక్కగా తయారయి, మా ఆయనా, పిల్లలతో, సినిమాకి వెళ్ళి, హోటల్లో భోజనంచేసి, ఇంటికి వెళ్తానండి! మీకు తెలియందేముందండి బాబుగారూ! చింపిరి జుట్టంటారా? యెంతసేపొస్తుంది—జుట్టు విప్పి రోడ్డు మీద రెండు సార్లు పొర్లాడితే!”

భారత దేశం బీదది అనే దమ్ము యెవరికుంది?

"స్లం డాగ్ మిలియనీర్" కి ఇన్ని అవార్డ్ లు యెందుకు వస్తున్నాయి? (అరిందం చౌదరి సరిగ్గా తన అక్కసు వెళ్ళగక్కలేకపోతున్నాడు!)

Saturday, January 31, 2009

మూడు కుంభకోణాలు

మరో మూడు సత్యాలు……!

ఘోరమైన నిజాలు బయట పడుతున్నాయి!

మరో మూడు కంపెనీలు—రియల్ ఎస్టేట్ రంగంలోవి—పేపర్లలో ఇవాళ (31-03-2009) వచ్చింది.
“డీ ఎల్ ఎఫ్”; “శోభా డెవలపర్స్”; “యూనిటెక్” ల గురించి!

1. డీ ఎల్ ఎఫ్: దీనికి 245 అనుబంధ సంస్థలూ, 12 భాగస్వామ్య సంస్థలూ, 12 సం యుక్త సంస్థలూ, ప్రమోటర్ల నియంత్రణలో మరో 124 సంస్థలూ ఉన్నయట!

2. శోభ డెవలపర్స్: ఈ యాజమాన్య ప్రముఖుల అధీనంలో 47 సంస్థలు ఉన్నాయట! 3. యూనిటెక్: యూనిటెక్ కార్పొరేట్ పార్క్స్ అనే లిస్టెడ్ కంపెనీ, యూనిటెక్ వైర్లెస్ అనే నమోదుకాని కంపెనీ, 316 అనుబంధ సంస్థలూ, 21 సం యుక్త సంస్థలూ,

ఈ కంపెనీ, స్థిరాస్థి వ్యాపారానికి నిధులు అవసరం అయినప్పుడు యేమాత్రం సంబంధం లేని టెలికాం వ్యాపారం లో పెట్టుబడులు పెట్టిందట!

వీళ్ళ గురించేనా—‘రియల్ ఎస్టేట్ రంగంలో మాంద్యం’; ‘సామాన్యుల నడ్డి విరుస్తున్న వడ్డీ రేట్లు’ ‘వడ్డీల తగ్గుదలతో సామాన్యుడికి కాస్త ఉపశమనం’ లాంటి శీర్షికలతో శ్రీ తుమ్మల కిషోర్ లాంటి కాలమిష్టులు బాధనీ, సంతోషాన్నీ వెలిబుచ్చింది?

ఒకరే రెండు మూడు కంపెనీలని అంతకన్నా యెక్కువ కంపెనీలని స్థాపించి, ఒకదాని నించి ఇంకోదానికి డబ్బు బదిలీ చేస్తూ, ఆటాడుకోవడాన్ని—మనీ లాండరింగ్ అంటారు!

9/11 తరవాత, మన భారత ప్రభుత్వం—అంతర్జాతీయ పరిశోధన ఫలితంగా, ఆ టెర్రరిష్టులకి ఇండియా నించి కూడా నిధులు అందాయి అని నిర్ధారణ అయినప్పుడు, పీ ఎం ఎల్—ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఎండ్ కంట్రోల్ ఆఫ్ టెర్రరిజం……అనే ఒక చట్టాన్ని చేసి, బ్యాంకులకి ‘యెవరైనా యేఖాతాలోనైనా, 10 లక్షలకు పైబడి లావాదేవీలు చేస్తే, వెంటనే వాళ్ళ పేర్లూ, అడ్రెస్ లూ, పాన్ నెంబర్లూ వగైరా రిజర్వు బ్యాంకుకి తెలియజెయ్యాలి’ అని అజ్ఞాపించి, ఇప్పటిదాకా జరిపించుకుంటోంది!

మరి ఆ రిపొర్టులు అన్నీ యేమైపోతున్నట్టు? మన రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్; సెబీ—ఇలాంటివన్నీ యేం చేస్తున్నట్టు?
అదే మన బ్యూరాక్రసీ!

ఆయనే వుంటే మంగలాడెందుకు?