Saturday, January 31, 2009

మూడు కుంభకోణాలు

మరో మూడు సత్యాలు……!

ఘోరమైన నిజాలు బయట పడుతున్నాయి!

మరో మూడు కంపెనీలు—రియల్ ఎస్టేట్ రంగంలోవి—పేపర్లలో ఇవాళ (31-03-2009) వచ్చింది.
“డీ ఎల్ ఎఫ్”; “శోభా డెవలపర్స్”; “యూనిటెక్” ల గురించి!

1. డీ ఎల్ ఎఫ్: దీనికి 245 అనుబంధ సంస్థలూ, 12 భాగస్వామ్య సంస్థలూ, 12 సం యుక్త సంస్థలూ, ప్రమోటర్ల నియంత్రణలో మరో 124 సంస్థలూ ఉన్నయట!

2. శోభ డెవలపర్స్: ఈ యాజమాన్య ప్రముఖుల అధీనంలో 47 సంస్థలు ఉన్నాయట! 3. యూనిటెక్: యూనిటెక్ కార్పొరేట్ పార్క్స్ అనే లిస్టెడ్ కంపెనీ, యూనిటెక్ వైర్లెస్ అనే నమోదుకాని కంపెనీ, 316 అనుబంధ సంస్థలూ, 21 సం యుక్త సంస్థలూ,

ఈ కంపెనీ, స్థిరాస్థి వ్యాపారానికి నిధులు అవసరం అయినప్పుడు యేమాత్రం సంబంధం లేని టెలికాం వ్యాపారం లో పెట్టుబడులు పెట్టిందట!

వీళ్ళ గురించేనా—‘రియల్ ఎస్టేట్ రంగంలో మాంద్యం’; ‘సామాన్యుల నడ్డి విరుస్తున్న వడ్డీ రేట్లు’ ‘వడ్డీల తగ్గుదలతో సామాన్యుడికి కాస్త ఉపశమనం’ లాంటి శీర్షికలతో శ్రీ తుమ్మల కిషోర్ లాంటి కాలమిష్టులు బాధనీ, సంతోషాన్నీ వెలిబుచ్చింది?

ఒకరే రెండు మూడు కంపెనీలని అంతకన్నా యెక్కువ కంపెనీలని స్థాపించి, ఒకదాని నించి ఇంకోదానికి డబ్బు బదిలీ చేస్తూ, ఆటాడుకోవడాన్ని—మనీ లాండరింగ్ అంటారు!

9/11 తరవాత, మన భారత ప్రభుత్వం—అంతర్జాతీయ పరిశోధన ఫలితంగా, ఆ టెర్రరిష్టులకి ఇండియా నించి కూడా నిధులు అందాయి అని నిర్ధారణ అయినప్పుడు, పీ ఎం ఎల్—ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఎండ్ కంట్రోల్ ఆఫ్ టెర్రరిజం……అనే ఒక చట్టాన్ని చేసి, బ్యాంకులకి ‘యెవరైనా యేఖాతాలోనైనా, 10 లక్షలకు పైబడి లావాదేవీలు చేస్తే, వెంటనే వాళ్ళ పేర్లూ, అడ్రెస్ లూ, పాన్ నెంబర్లూ వగైరా రిజర్వు బ్యాంకుకి తెలియజెయ్యాలి’ అని అజ్ఞాపించి, ఇప్పటిదాకా జరిపించుకుంటోంది!

మరి ఆ రిపొర్టులు అన్నీ యేమైపోతున్నట్టు? మన రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్; సెబీ—ఇలాంటివన్నీ యేం చేస్తున్నట్టు?
అదే మన బ్యూరాక్రసీ!

ఆయనే వుంటే మంగలాడెందుకు?

No comments: