Thursday, December 2, 2010

Our Banks - 2

Golden Days

There were days in our Banks, when the work force was blatantly exploited, majority of the 'employees' were paid by the loanees instead of the Bank, The Officers/Managers behaved like School Head Masters, the clerks were treated as bonded labour arriving at the Bank just after sun rise and reached homes around midnight!

Then came the Trade Unions in the Banks, which formed the mighty "All India Bank Employees Association".

After prolonged struggles, Desai Award set forth clear working conditions and appropriate salaries to the employees and the workers were jubiliant.

Later came Sastry award, which improved the working conditions admirably. The Banks working was streamlined.

Later a permanent mechanism to deal with periodical wage revisions and improvement in working conditions came into being in the shape of "Bi-partite Negotiations". By this time, the Scheduled Banks in India have also formed an association viz. "Indian Banks' Association" and bi-partite negotions were held between the representatives of the IBA and AIBEA.

The Awards & bi-partite settlements covered the "Award Staff" of the Banks, comprising of Clerical & Subordinate Staff, who were in large majority than the other cadre i.e. "Officers" comprising of Supervisory staff and Executives.

The wage increases, with dearness alloance based on the "Consumer Price Index"; merger of DA with Basic periodically, were reasonable. The increases for supervisory & other Staff were also commensurate with those of Award Staff.

So, those of the people who tried to 'corrupt' the Staff were immediately shown the exit door!

The AIBEA leadership was in the hands of Communist party/ies mainly CPI. There were eminent leaders in the Trade Unions of individual Banks as well as AIBEA like Comrade Parvana and Prabhat Kar. They sacrificed their careers as well as lives for the cause of the work force!

Gradually, with the advent of Indira Gandhi, and nationalisation of Banks Government interference had grown manifold effecting the IBA also. All matters had to be referred to the Government.

........to be continued.

Tuesday, November 30, 2010

Our Banks

Corrupt Bank CEOs!

It is shocking to note that a few of the executives of public sector Banks, even the Chairmen & Managing Directors are involved in corrupt practices. Where does the fault lie?

Where else but with the Government of the Day?

Recently the RBI Governor lamented, Top executives of Banks, including RBI are being paid meagre emoluments whereas those of the new generation Banks are getting paid substantially. For example, the CEO of ICICI Bank receives a cool Rs.2.20 crores p.a. in pay and allowances alone!

So, that is the crux of the matter. In case of the public sector Banks, every thing is to be 'referred' to the Government. 

If a Bank wants to provide a small perquisite like provision of residential News paper to its employees, bearing a cost of a maximum of Rs.120/- per employee per month, permission is to be accorded by the Dept. of Finance/Banking! There the beurocrats taking their own time lastly agree to the same, incorporating a condition that 'the sale proceeds of the old news papers should be repaid to the Bank!'

Even for regular periodical merger of Dearness Allowance with Basic pay every five years, which should be a simple excercise, a mountain of a mole hill is created and after prolonged agitations and negotiations only the matter is settled subject to final approval by the Governemnt!

A 40 years ago, the Bank employees were the highest paid in the working class. The reason was said to be, "the Money they deal with regularly should be treated by them 'equally' as the scavengers treat the  'material' they handle professionally".

When I joined a Bank as clerk-cum-cashier, in 1973, my gross & net salary was Rs.383/-, without any cuttings as I was in probation. At the same time, other employees of the same cadre in Government and other sectors were paid Rs.75/- to Rs.150/- per month!

Now, if the earnings were increased on the same scale, I should be drawing at least a net salary of Rs.38,300/- per month. Where as my net Salary is around Rs.15,000/- and in case of employees who availed all the available loans from the Bank, it would be around Rs.7,500/-!

So, what happens? The money with which they deal regularly looks like Gold or platinum! They start exploring 'other ways' to acquire it.

........to be continued.

Tuesday, October 12, 2010

వుట్టికెక్కలేను గానీ.....



స్వర్గానికి నిచ్చెనలు.....

......వేసి, మీకందరికీ జాబిల్లిని అందుబాటులోకి తెస్తామంటున్నాయి మన బ్యాంకులకి వేస్తున్న వెఱ్ఱితలలు.

పల్లె పల్లెలో బ్యాంకింగ్ సేవలని 'విస్తృతంగా' విస్తరింపజేయడానికి, త్వరలో "మైక్రో" (సూక్ష్మ) యే టీ యెం లు పెడతారట!

ఇప్పుడు బ్యాంకులు పల్లెల్లోని కిరాణా కొట్లకీ, పాల కేంద్రాలకీ, పనిలేని వేస్ట్ ఫెలోస్ కే కాకుండా, 'సూక్ష్మ ఋణ సంస్థలకీ', టాటా, రిలయెన్స్, భారతీ లాంటి సంస్థలు 'స్థాపించబోయే' సంస్థలకీ తమ 'బిజినెస్ కరస్పాండెంట్లు ' (బీ సీ లు) గా నియమించుకోడానికి అనుమతి ఇచ్చేశారుగా! 

వీళ్ల దగ్గర ఈ యేటీయెం లు పెడతారట! వీటి ద్వారా, పల్లె ప్రజలు తమ "నగదు చెల్లింపు, స్వీకరణ, బదిలీ" లు చెయ్యవచ్చట. ఇంకా, "బీమా పాలసీలు, పింఛను ఖాతా చెల్లింపులు, ఎస్ హెచ్ జీ ల ఋణాలపై వడ్డీ అందచేత, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు" వంటివన్నీ నిర్వహించుకోవచ్చట!

దేశం లోని యేమారుమూల పల్లెకు వీళ్లు వెళ్లినా, అక్కడనించి కూడా లావాదేవీలు నిర్వహించుకోవచ్చట!

(దేశం లో ఇంతవరకూ అన్ని బ్యాంకులూ నిర్వహిస్తున్న లక్షలాది యేటీయెం లలో--'నగదు చెల్లింపు మాత్రమే' జరుగుతోంది! కొన్ని బ్యాంకులు 'చెక్కుల డిపాజిట్', 'నగదు డిపాజిట్' లు నిర్వహిస్తున్నా, నగదు డిపాజిట్ లో సమస్యలు వచ్చి, మానేశాయి. మరి కొన్ని లక్షల ఖర్చుతో యేర్పాటు చేసిన పెద్ద యేటీయేంలు చెయ్యలేని వ్యవహారాలని మైక్రో లు యెలా నిర్వహిస్తాయో!)

"దేశం లోని గృహస్తులందరినీ బ్యాంకింగ్ పరిధి లోకి తేవాలనే లక్ష్యం తో ఆర్బీఐ గత కొంతకాలం గా చేపడుతున్న కార్యక్రమాలకి ఇప్పుడు ఈ సూక్ష్మ యేటీయెం లు యెంతగానో దోహదపడతాయని" బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట! దువ్వూరి సుబ్బారావుగారూ--నమస్కారం!

(ప్రభుత్వమూ--గుత్తేదారులూ--సలహాదారులూ--టెండర్లూ--కోట్లకి కోట్లూ--మామూలే!)

కొసమెరుపేమిటంటే--వీటన్నిటికీ ఆథారం--మన ప్రజా పంపిణీ వ్యవస్థ యెవరికి రేషన్ ఇవ్వదలచుకొన్నారో, వారికి మాత్రమే కేటాయించే "ఆథార్" సంఖ్యా, కార్డులేనట!

మబ్బుల్లో నీళ్లు చూసి, ముంత వొలకబోసుకోం కదా చివరికి? యేమో!   

Sunday, October 10, 2010

Online Businesses

Inter(net)national Cheats

The "India Today Book Club" was continuing to send their 'promos' through my E-mail. After publication of my Post calling them "Cheats" also I have received such an E-mail to which I replied, enclosing the link to the post, "If you have any reply, then only you answer. Otherwise do not continue cheating the public." to which I have not received any reply till date.     

So, DO NOT BE CARRIED AWAY BY THEIR (FALSE) REPUTATION.

The second I have mentioned in my post is the more famous "India Times shopping".

They advertise this shop on half of the front page on their group's news papers in all editions, showing some of the products with discounts.

I have been ordering some articles 'on line' and getting them perfectly in order within 15 to 21 days. 

When more than a year ago I ordered an article worth just less than Rs.400/-, they have informed me, as usual, via E-mail that the article was parcelled to my address.

But I found that the address on the parcel as mentioned in the E-mail by them contained only my Name and the name of my Town--without 'any other particular--including PIN Code' and wondered how the parcel would reach me.

Immediately I have mailed them regarding the mistake but received no reply.

After more than a month, when I have started mailing them regarding the article, one fine day, they coolly replied that the article was returned to them 'undelivered!'

When I asked them to resend me the parcel or refund the amount to my Credit Card account, they replied that an article undelivered could not be resent, and as amounts below Rs.1000/- will not be credited to Card accounts they have already refunded the amount to me through their "Refund Voucher"....or something like that. And I could re-order the same article, on line, by making payment through that refund order or.........!

I have informed them that I am not in receipt of any such refund order or........, through my E-mail or by post, but they were keeping mum!

After so many mails, I thought, 'they are a corporate giant--usurping public money in........! how can I seek refund of such a 'tiny amount!'

So, I also kept mum.

My advise again is "DO NOT BE CARRIED AWAY BY THE VISIBLE FAME OF SUCH COMPANIES/SHOPS".

There are other experiences also with other 'reputed' companies, and I may write in due course.

Thank you.



Saturday, September 25, 2010

Online Businesses

Inter(net)national Cheats

Today, I write about 2 of such cheats, among many other I have come accross--1. India Today Book Club and 2. India Times Shopping--who have cheated me shamelessly and not regretting it till now.

I am a member of the prestigeous India Today Book Club, since its inception, when they used to publish a monthly catalogue about the books available with them, new releases etc. They offered discounts to the book lovers who are its members. Payments were through regular means, including Credit Cards.

During the last 2 decades, I have purchased books worth between 1 lakh & 2 lakhs--with prices so low in those days.

But, during 2009, they have started sending worthless books by VPP to members, under some scheme members are not aware of. Expecting the books to be worthy, members used to pay the VPP charges--in hundreds of rupees--and get them only to find them worth less later.

Then, they have gone online, stopped publishing the catalogue, sent Login IDs and Pass Words to the members to enable them to book the orders online.

My membership was renewed for 3 years during 2009 and I have duly obtained the free books allowed for members who renew their subscription for 3 years.

When I tried to login to www.indiatodaybookclub.com with the ID and pass word, it dit not allow me, saying the membership has expired!

I have started e-mailing them from 26-02-2009 about the difficulty. The replies were just to placate me by saying they have rectified the mistake and I can login at any time. In a few days, I was vexed with them and stopped corresponding.

Even now, if we try to login into the website, we are directed to http://www.bagittoday.com/itbc/index.jsp? and we have to login with our e-mail address and password. When we try, the message is 'the mail address is not registered with us.'

Is this the way, such a prestigeous organisation should cheat the citizens and be scot free?

........to continue

Sunday, September 5, 2010

బ్యాంకులకి

బురిడీ

ఓ పెద్దమనిషి, తన చేతికి వచ్చిన ఓ ఇంటితాలూకు దస్తావేజుని కలర్ జెరాక్సులు తీయించి, వాటిని కనీసం 26 బ్యాంకులలో తనఖా పెట్టి, ఆరుకోట్ల మేర బురిడీ కొట్టించడమే కాకుండా, ప్రైవేటు వ్యాపారస్తుల్ని కూడా ముంచాడట!

ఈ డబ్బుతో తాను సినిమా తీస్తున్నాననీ, అది హిట్ ఐతే మీ ఋణాలు మీ ముఖాన్న కొడతాననీ చెప్పాడట!

ఇంకా--బ్యాంకులవారికి ముడుపులు చెల్లిస్తే, యెంతైనా ఋణం పొందచ్చు--అని కూడా ముక్తాయించాడట!

బ్యాంకులూ! యెక్కడికి పోతున్నాయి?

ప్రజల డబ్బుకి రక్షణ వుంటుందా?

Monday, August 23, 2010

బ్యాంకులూ--గిమ్మిక్కులూ

వడ్డీ రేట్లు

మీకు గుర్తుండే వుంటుంది--క్రితం యేడాది దాదాపు ఇవే రోజుల్లో, తుమ్మల కిషోర్ లాంటివాళ్లు "సామాన్యుల నడ్డి విరుస్తున్న వడ్డీ రేట్లు" అంటూ ఆక్రోశించడం, అప్పుడు నేను వ్రాసిన టపాలూ!

ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి--మళ్లీ ఋణాలమీద వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి--అంటూ!

జూన్ 30 వరకూ వున్న ఋణాలకి పీ ఎల్ ఆర్, జూలై 1 నించి ఇచ్చినవాటికి బేస్ రేట్ వర్తిస్తుందంటున్నారు. ఇప్పటికే పీ ఎల్ ఆర్ లు పెంచేశారు, బేస్ రేట్ పెంచే ఆలోచన లో వున్నారు!

నిజం గా ఇదొక విషవలయం.

ద్రవ్యోల్బణం పెరుగుతోందని, ఎస్ ఎల్ ఆర్, సీ ఆర్ ఆర్, రెపో/రివర్స్ రెపో రేట్లు పెంచడం--ఈ రేట్లు పెరిగాయని, బ్యాంకుల తమ నిధిసేకరణ కోసం డిపాజిట్ల మీద వడ్డీరేట్లు పెంచడం, అవి పెరిగాయికాబట్టి ఋణాలమీద వడ్డీరేట్లు పెంచడం............ఇలా "పెరిగాయి, పెరిగాయి" అనడం, "తగ్గాయి, తగ్గాయి" అనడం!

నిజమే--ఋణాలమీద వడ్డీ రేట్లు నూటికి, సంవత్సరానికి, పావలా పెరిగినా, సామాన్యుడిమీద అది పైకి కనిపించని భారమే!

అదే డిపాజిట్లమీద పెరిగితే, కనపడేంత పెరుగుదలగానే కనిపిస్తుంది--ఇదీ సహజమే!

మరి మతలబేమిటంటే, ఋణాలమీద రేట్లు పెరిగితే, అవి మీరు ఓ పదిహేను యేళ్ల క్రితం తీసుకున్నవైనా, ఇంకో అయిదేళ్లలో గడువు ప్రకారం తీరిపోతుందనుకొని నిశ్చింతగా వున్నా, ఈ పెరుగుదల వల్ల--ఈ ఎం ఐ అయినా పెరుగుతుంది, లేదా గడువు తేదీ అయినా మారుతుంది!  

అదే డిపాజిట్ల మీద పెరిగిన రేట్లు--పాతవాటికి వర్తించవు--కొత్తవాటికి మాత్రమే! ఓ చిన్న వెసులుబాటేమిటంటే, పాత డిపాజిట్లని యెక్కువ వడ్డీ రేటు కోసం ఇవాళ రద్దు చేసుకొని, మళ్లీ కొత్తగా డిపాజిట్ చేసినట్టు వ్రాయించుకున్నా, నిన్నటివరకూ ఇంతకుముందు ఒప్పుకొన్న రేటు ప్రకారం వడ్డీని యెలాంటి మినహాయింపులూ లేకుండా చెల్లిస్తారు. 

కానీ, ఆ పెరుగుదల జరిగిన రోజునించీ ఒక్కరోజు ఆలస్యం గా బ్యాంకుకి వెళ్లినా, నష్టమే!

వుదాహరణకి, రేట్లు 16-08-2010 నించి పెరిగాయనుకోండి, మీరు 23 న వెళ్లి, మీ డిపాజిట్ ని కొత్తగా వ్రాయించుకున్నారనుకోండి, మీకు 7 రోజుల వడ్డీ పాత రేటు ప్రకారమే వస్తుంది! పైగా, ఇవాళనించీ వాళ్ల స్కీము ప్రకారం--ఓ యేడాది అనుకుందాం--గడువు తేదీ కూడా 7 రోజులు ముందుకు పోతుంది!

(ఇక ఋణ వితరణ, 'కాసా'లు, 'అల్కో'లు లాంటి వాటి గురించి మరోసారి)  

Monday, July 19, 2010

సినీపరిశ్రమ

పైరసీ

సినిమాలు తియ్యడం దగ్గరనించి, ప్రజలకి వాటిని చూపించి, డబ్బులు చేసుకోవడం వరకూ 'పరిశ్రమ' అని వొప్పుకుంటే, మిగిలిన భాషల సినిమాల మాట నాకు తెలియదు గానీ, తెలుగు సినిమాలకు ఇది వర్తిస్తుందా అని నాకు సందేహం.

ఈ విషయాన్ని బాబూ మోహన్, మోహన్ బాబు లాంటివాళ్ళు చక్కగా చెప్పగలరు.

కావేరీ జలాల గురించి తమిళ సినీ పరిశ్రమ అంతా కదిలి వెళ్ళింది.

కర్ణాటక లో, ఖచ్చితం గా కన్నడ సినిమాలే ప్రదర్శించాలనీ, యెక్కడైనా ఖాళీ వుంటేనే మిగిలిన భాషా చిత్రాలు ప్రదర్శించుకోవచ్చనీ, కట్టడి చేసి, అమలు చేస్తున్నారు.

మళయాళం గురించి నాకు తెలియదు. యెందుకంటే, ఈ భాషల వాళ్ళు తమ చిత్రాలని అక్కడ విడుదల చేసి ప్రదర్శించగలరనుకోను.

ఇక పైరసీ విషయానికి వస్తే, అది 'ఆర్గనైజ్డ్ క్రైమ్' అని వొప్పుకోవాలి. గొప్ప గొప్ప దేశ ప్రభుత్వాలే మాఫియా లాంటివాటినీ, డ్రగ్స్ నీ యేమీ చెయ్యలేకపోతున్నారంటే, మన ప్రభుత్వాల సంగతి చెప్పఖ్ఖర్లేదు.

ఇక వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న పెద్ద హీరోల సినిమాలు పైరసీ వల్ల యెక్కువ నష్టపోతున్నాయి అని కొంతమంది బాధ పడుతున్నారు.

నిజమే--కానీ వాళ్ళు చేసేదీ వ్యాపారమే కదా? పెద్ద హీరోల సినిమాలకి పబ్లిసిటీకి, ప్రమోస్ కి, జనాల్లో ఎక్స్ పెక్టేషన్ లని పెంచడానికి యంత ఖర్చు పెడుతున్నారో అందరూ వూహించగలరు. ఇదే వాళ్ళ కొంప ముంచుతోంది.

విడుదలయిన రోజో, ఆ మర్నాడో తమ అభిమాన హీరో సినిమాని కేవలం "పది రూపాయల" ఖర్చు తోనే చూడగలుగుతున్నారు. అందుకే వాటికోసం యెగబడుతున్నారు--వందలు ఖర్చుపెట్టి థియేటరుకి వెళ్ళి చూడలేని సామాన్యులు.

చిన్న బడ్జెట్ సినిమాలకి సీడీలు వెంటనే విడుదల అవకపోయినా యేమీ ఫరవాలేదు--దొరికినప్పుడే చూస్తారు--లేదా, టీవీలూ, కేబుల్ టీవీలూ వుండనే వున్నాయి--పదిరూపాయల ఖర్చు కూడా లేకుండా చూడవచ్చు.

ఆ మధ్య టీవీల్లో కథనాలు వచ్చాయి పైరసీ యెలా జరుగుతోంది? అనే విషయం లో--కొంతవరకూ అన్నీ నిజాలే.

సినిమా టైటిల్, దాని డిజైన్ ఖరారవ్వగానే, అది పైరసీవాళ్ళకి చేరి పోతోంది. స్టిల్ ఫోటోలు పబ్లిసిటీ కోసం తియ్యబడగానే, అవి పైరసీవాళ్ళకి చేరుతున్నాయి. ఇక వాళ్ళు సీడీల కవర్ డిజైన్లని రూపొందించుకొని, ప్రింటు చేసేసి, సిధ్ధం గా వుంటున్నారు.

సినిమా విడుదల అయి, మొదటి ఆట ప్రదర్శించబడగానే, ఓ గంటలోపే సినిమా వీడియో మొత్తం కంప్యూటర్లో అప్ లోడ్ అయిపోయి, వెంటనే 50 నించి 80 వేల సీడీలు తయారయ్యి, మర్నాడు పొద్దున్నకల్లా, మన నగరాలూ పట్టణాల్లోని షాపులకీ, లైబ్రరీలకీ చేరుతున్నాయి.

ఈ అప్ లోడ్ అయిన సినిమాలని సీడీల్లో కాపీ చెయ్యడం అనేది చెన్నై, బెంగుళూరుల్లో జరుగుతున్నాయేమోనని టీవీవాళ్ళ సందేహం.

అంత ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న వ్యవహారాన్ని అరికట్టడం ప్రభుత్వం చేతుల్లో వుందా?

కొంతమంది, ఫలానా సినిమా పైరసీ సీడీలు మార్కెట్లోకి రాకుండా జాగ్రత్త పడ్డారు--మిగిలిన వాళ్లు కూడా ఆ రహస్యం తెలుసుకోండి--అని అంటున్నారు.

పబ్లిసిటీకి కొన్ని కోట్లు ఖర్చుపెట్టగలిగినవాళ్ళకి, హైదరాబాదు, విజయవాడల్లో, మిగిలిన పెద్ద పట్టణాల్లో యే థియేటరు నించి విడియో తియ్యబడుతోందో నిఘా పెట్టడం ఓ లెఖ్ఖా? (కానీ ఈ పని జరగడం లేదు--యెందుకో వూహించండి)

ఇక మహేష్ బాబులూ, పవన్ కల్యాణ్ లూ--నిజజీవిత హీరోలుగామారినట్టు నటించి, అభిమానులని వెంటేసుకెళ్ళి, షాపులని ధ్వంసం చెయ్యడం, వాళ్ళని చితక తన్నడం అనేవి కూడా పబ్లిసిటీ స్టంట్లే అని తెలియడం లేదూ?

అప్పుడప్పుడూ ముఖ్య మంత్రి కి విన్నపాలు ఇవ్వడం, సభల్లో మొసలి కన్నీళ్ళు కార్చడం, కొంతమంది చేత పైరసీ సీడీలు చూడడానికి వ్యతిరేకం గా స్టేట్ మెంట్లు ఇప్పించడం లాంటి పనులు చేస్తూ జీవిస్తున్నారు పరిశ్రమ పెద్దలు.

ఇదంతా అర్థం కాని కొందరు పినాకొ లు--ఈ విషయం పై వ్యాఖ్యానించేవాళ్ళమీద అడ్డం గా విరుచుకు పడుతున్నారు. వీళ్ళు తెలుసుకోవలసిన విషయం యేమిటి అంటే, వీళ్ళెంతగా విరుచుకుపడతారో, అంత పొడుగ్గానూ వాళ్ళ ముక్కు పెరిగి పోతుందని.

సినీపారిశ్రామికులూ, బ్లాగరులూ, సర్వేజనాస్సుఖినో భవంతు!       

Wednesday, July 7, 2010

వడ్డీ రేట్లు

బేస్ రేట్

తుమ్మల కిశోర్ కి యిప్పుడు వెలుగుతున్నట్టుంది--మొన్న "ఇన్నాళ్ళూ పీ ఎల్ ఆర్ మైనస్ 'ఇంత' పర్సెంట్" అని వ్యవహరించేవి బ్యాంకులు. ఇప్పుడు బేస్ రేట్ ప్లస్ 'ఇంత' పర్సెంట్ అని అంటాయి తప్పితే, పెద్ద మార్పేమీ వుండదు" అన్నట్టు వ్రాశాడు.

ఇది వరకు పీ ఎల్ ఆర్ కన్నా తక్కువకి ఋణాలిచ్చే బ్యాంకులు, ఇప్పుడు బేస్ రేట్ కన్నా తక్కువకి ఇవ్వలేవు--అని కూడా వ్రాశాడు.

(ఈ పీ ఎల్ ఆర్ విషయం లో బ్యాంకులు యెన్ని వెరయిటీలు ప్రవేశ పెట్టాయో ఇదివరకు టపాల్లో వ్రాశాను.)

మరదే--నీ యెడం చెయ్యి తియ్యి, నా పుర్ర చెయ్యి పెడతాను--అంటే!

దాదాపు 130 యేళ్ళక్రితం బ్రిటీషు వాళ్ళు ప్రవేశపెట్టిన "నెగోషియబుల్ ఇన్స్ ట్రుమెంట్స్ ఆక్ట్" క్రింద పనిచేసేవి మన దేశం లోని బ్యాంకులు. (ఇప్పుడా చట్టం ఒక్క విషయం లోనే--బ్యాంకులకి రాష్ట్ర ప్రభుత్వాలు సెలవలు ప్రకటించడానికే--వుపయోగిస్తోంది! బ్యాంకులే కాదు, బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ సహితం ఈ చట్టాన్ని తుంగలో తొక్కేశారు ఇప్పుడు!)

ప్రామిసరీ నోట్ (ప్రో నోటు); చెక్కు; బిల్ ఆఫ్ ఎక్స్ ఛేంజ్--ఇవీ నెగోషియబుల్ ఇన్స్ ట్రుమెంట్ లు అంటే.

ప్రామిసరీ నోట్ అంటే బ్యాంకులు స్వల్పకాల ఋణాలు ఇవ్వడానికి వ్రాయించుకొనేవి--ఇవి 3 సంవత్సరాలు మాత్రమే చెల్లుతాయి--యెవరు వ్రాసినా, యెవరు వ్రాయించుకున్నా.

చెక్కు అంటే--మనం బ్యాంకులో దాచుకున్న డబ్బుని మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వమని బ్యాంకుకి జారీచేసే అధికార పత్రం. దీని విషయం లో లక్షా తొంభై రూల్సు అవసరమయ్యాయి కాల క్రమం లో. కొన్ని లక్షల కేసులు నమోదు చెయ్యబడేవి, బడుతూనే వున్నాయి ఇప్పుడు కూడా.

ఇక, బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్ అంటే, ప్రో నోటు కి వ్యతిరేకం--నువ్వు నాకు నేనడిగినప్పుడు లేదా ఫలానా తారీఖు కి ఇంత డబ్బు ఇవ్వాలి అని వ్రాసేవి. వీటిలో 'సైట్' బిల్లులు అంటే, దాన్ని యెవరిని వుద్దేశించి వ్రాయబడిందో వాళ్ళు 'అంగీకారం' తెలపాలి. దీనికి బ్యాంకులు మీడియేటర్లుగా వుండేవి. సైట్ అంటే, "నువ్వు అంగీకరించిన తరవాత ఇన్ని రోజులకి/నెలలకి ఆ డబ్బు నాకుగానీ, నా ఆర్డరు పొందినవారికి గానీ చెల్లించాలి" అని వ్రాసేవి. 

ఇక్కడ ఆ చట్టం అవసరం వచ్చేది--డ్యూ డేట్ (చెల్లించవలసిన తేదీ) యేది--అనే విషయం లో. సామాన్యం గా చట్టం ప్రకారం, అంగీకారం అయిన తరవాత, యెన్నిరోజులు/నెలలు అయితే అన్నీ లెఖ్ఖపెట్టి, దానికి మూడు రోజులు 'గ్రేస్' (వుదారం గా) కలిపి, డ్యూ డేట్ నిర్ణయించాలి. ఒకవేళ, ఆ తేదీ గనక బ్యాంకుకి సెలవు అయితే, "అంతకు ముందు బ్యాంకు పనిచేసే రోజే" చెల్లింపు తేదీ గా మారుతుందన్నమాట!

అందుకనే, ఈ చట్టం క్రిందే, బ్యాంకులకి సెలవలు ప్రకటిస్తారు.

ఇలా "అంగీకృతమైన" బిల్లులని, బ్యాంకులు 10 శాతమో యెంతో తాము 'డిస్కవుంట్' గా స్వీకరించి, మిగిలిన సొమ్ము వ్రాసినవాడికి చెల్లించేసేవి--తాము డ్యూ డేట్ నాడు పూర్తి మొత్తం వసూలు చేసుకొనేవి.

బ్యాంకుకి అత్యవసరం అయితే, అలా తాము డిస్కవుంట్ చేసుకున్న బిల్లుల మొత్తం విలువని, రిజర్వ్ బ్యాంకు దగ్గర తనఖా పెట్టి, వడ్డీకి పైకం పొందేవి. అలా రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటునే "బ్యాంక్ రేట్" అనేవారు.  

రిజర్వ్ బ్యాంకు యెప్పటికప్పుడు తన "బ్యాంక్ రేటు" ని ప్రకటించేది. మార్చాల్సి వస్తే, ఫలానా తేదీ నించి నా బ్యాంక్ రేట్ ఇంత--అని ప్రకటించేది. 

అందుకనే, బ్యాంకులు తమ వడ్డీ రేట్లకి ఆధారం గా ఈ బ్యాంక్ రేట్ ని స్వీకరించేవి--ప్రభుత్వమైనా, కోర్టులైనా, ప్రజలైనా ఇదే రేటుకి కట్టుబడేవారు--అదీ ఆ రేటుకున్న "పావిత్ర్యం" (Sanctity)!

--మిగతా మరోసారి.

Thursday, July 1, 2010

వడ్డీ రేట్లు

బేస్ రేట్

"నీ యెడం చెయ్యి తియ్యి, నా పుర్రచెయ్యి పెడతాను" అన్నాట్ట వెనకటికెవడో!

అలా వుంది మన బ్యాంకుల వ్యవహారం.

సంస్కరణలకి పూర్వం, రిజర్వ్ బ్యాంక్ మన బ్యాంకుల వడ్డీ రేట్లని నియంత్రించేది. 

"బ్యాంక్ రేట్" (రిజర్వ్ బ్యాంక్ రీడిస్కౌంట్ రేట్) ఇంత అని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేది. బ్యాంకులు 'బ్యాంక్ రేట్ కన్నా ఇంత శాతం అధికం' అని చెప్పి, అంతా వసూలు చేసేవి--ఋణాలపై.

(రిజర్వ్ బ్యాంక్ రీ డిస్కౌంట్ రేట్ గురించి నా ఇదివరకటి టపాలు చూడండి)

సంస్కరణల పుణ్యమా అని, బ్యాంక్ రేట్ రద్దు చెయ్యబడింది--బ్యాంకులనే వాటి ప్రథాన వడ్డీ రేట్లు (ప్రైమ్ లెండింగు రేట్లు) నిర్ధారించుకోమని స్వేఛ్ఛ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్.

(ఇదే పుణ్యం గా ఇంకా చాలా స్వేఛ్ఛలని ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్. వుదాహరణకి, కొత్త బ్రాంచీలు తెరవడానికి తన 'లైసెన్స్' అక్కర్లేదనీ, ఇంతకు ముందు వున్నట్టు 'సర్వీస్ యేరియా'ల లోనే అప్పులు ఇవ్వఖ్ఖర్లేదు, దేశం మొత్తం మీద యెక్కడైనా ఇవ్వచ్చు--ఇలాంటివి! కానీ మన బానిస బుధ్ధి బ్యాంకులు ఒక్క అప్పులు ఇవ్వడం విషయం లోనే పాటించాయి--దాంతో ఎన్ పీ యే లు పెరిగిపోయి, దివాళా స్థితికి వచ్చాయి--అది వేరే సంగతి)

బ్యాంక్ రేట్ అంటే, ఫలానా తేదీ నించీ ఇంత అని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేది. కాబట్టి అందరికీ ఆ రేటు తెలుసు--కోర్టులకి కూడా!

కానీ, పి ఎల్ ఆర్ కి వున్న 'పావిత్ర్యం' యేమిటి? యేయే రోజున యేయే బ్యాంక్ పి ఎల్ ఆర్ యెంత వుంది అన్నది యెవరికీ తెలియదు కదా? (తెలివైన లాయరు యెవరైనా బ్యాంకుల ప్రో నోట్లని కోర్టులో సవాలు చేస్తూ, ఫలానా రోజున మీ పి ఎల్ ఆర్ యెంతా? అది యెప్పుడెప్పుడు యెంతెంత మారిందీ, ఆ లెఖ్ఖన నా క్లయింట్ కట్టవలసిన బాకీ యెంత? అని అడిగితే, బ్యాంకులే తెల్లమొగం వెయ్యవలసిన పరిస్థితి!)

(పీ ఎల్ ఆర్ లలో యెన్ని వెరైటీలు కనిపెట్టారో కూడా నా పాత టపాలు చదివి తెలుసుకోండి)

సరే--అయిపోయింది. 

మరిప్పుడు, పీ ఎల్ ఆర్ స్థానం లో 'బేస్ రేట్' అని పెట్టి, దాన్ని 'శాస్త్రీయం గా' బ్యాంకులు నిర్ణయించుకోమంటే మాత్రం, దాని 'పావిత్ర్యం' యేమి వుంటుంది?

దీని మీద సో కాల్డ్ బ్యాంకింగ్ నిపుణుల వూహాగానాలు--ఋణాలు యెవరికి తక్కువ వడ్డీ కి అందుతాయి, యెవరికి పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థమీద వాటి ప్రభావం, 'టీజర్ రేట్లు' (ఇదో రకం వెర్రి) కొనసాగుతాయా లేదా?--ఇలా!

చెరువులో గేదెని ముంచి, కొమ్ములుచూసి బేరం చేస్తున్నట్టు లేదూ?

Tuesday, May 4, 2010

బ్యూరాక్రసీ

మందమైన చర్మం--3

ఎస్ టీ డీ లు వచ్చాక, టెలిగ్రాం విభాగం మూతపడింది.

కొరియర్ల పుణ్యమాని, పోస్ట్ ఆఫీసుల్లో పనిలేకుండా పోయింది. ప్రసాదాలు బట్వాడా తో మొదలు పెట్టి, ఇప్పుడు చింతపండూ, సబ్బులూ, ఉల్లిపాయలూ అమ్ముకునే స్థితికి వచ్చాయి. 

ఇంకా కొన్ని పత్రికలూ, షేర్ బ్రోకర్లూ మొదలైన వాళ్ళవల్ల కొంతమంది పోస్ట్ మేన్ లకి పని దొరుకుతోంది.

ఇక ఇందిరాగాంధీ హయాములోనే, శాం పిట్రోడా పుణ్యమాని, ఎస్ టీ డీ లు ప్రవేశపెట్టబడ్డాయి. రాజీవ్ హయాములో ఇంకా విస్తరించాయి. ప్రైవేటు కాయిన్ బాక్స్ లు వీధికో పదహారు వెలిశాయి (ఏస్ టీ డీ బూత్ లు కాకుండా).

ఉపగ్రహాలు పెరగడం తో ఐ ఎస్ డీ లు కూడా వృధ్ధి చెందాయి.

అలాంటి పరిస్థితుల్లో, పేపర్లో చిన్న చిన్న ప్రకటనలు వెలువడేవి--'ఒంటరితనం ఫీల్ అవుతున్నారా? ఫలనా నెంబరుకి ఫోన్ చెయ్యండి'; 'మీ జాతకం చెబుతాం--ఫలానా నెంబరుకి ఫోన్ చెయ్యండి'--ఇలా!

మా వూళ్ళో ఒకాయన, తన జాతకం కోసం ఆ నెంబరుకి ఫోన్ చేసి, సందేహాలు తీర్చుకున్నాడు. అంతలో టెలిఫోన్ జే యీ గారు ఆయన నెంబరుకి ఫోన్ చేసి, 'ఇప్పటివరకూ మీ ఫోన్ నించి మీరే మాట్లాడారా?--వూరికే నిర్ధారణకి అడుగుతున్నాను' అని పెట్టేశారట. 

తరవాత ఆ కాల్ కి 4 వేల చిల్లర బిల్లు వచ్చేసరికి, మన వాడికి తెలిసింది--జే యీ గారు యెందుకు నిర్ధారణ చేసుకొన్నారో!

ఇలాంటి చమత్కారాల సంగతి యెలా వున్నా, బీ ఎస్ ఎన్ ఎల్ పధ్ధతులు మాత్రం మార లేదు. 

ఇప్పటికీ, ఫోన్ కనెక్షన్ కావాలంటే, వేలు డిపాజిట్ కట్టి, ప్రతీ నెలా అద్దె కూడా కట్టాలి. 

ఇంకా నయం--ఇంతకు ముందు అయితే, ఫోన్ ని ఒక ఆఫీసులో, ఒక గదిలో, ఒక టేబుల్ మీద నించి ఇంకో టేబుల్ మీదకి మార్చాలన్నా, ముందు దరఖాస్తు పెట్టాలి. వాళ్ళు ఖర్చులకి 'ఎస్టిమేట్' వెయ్యాలి. మనం సరిపడా డబ్బు కట్టాలి. ఆ తరవాత ఏ మూడు నాలుగు నెలలకో (మన ఆఫీసు తో వాళ్ళ అవసరాన్నిబట్టి) పని జరిగేది.

చిత్రం యేమిటంటే, ఇప్పటికి కూడా ఆ రూల్స్ మారలేదట! ఇల్లు కట్టించుకున్న ప్రతీవాడు, కరెంటు వైరింగ్ తో పాటు ఫోన్ వైరింగ్ కూడా చేయించుకొని, పాయింట్లు పెట్టించుకొని, వాడుకొంటున్నారు.

మొన్నామధ్య, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చిన ఓ పెద్దమనిషి, "ఇంట్లో ఇన్ని 'పేరలల్' కనెక్షన్లు వుండకూడదండీ! ఒక్కటే వాడుకోండి" అని బాధపడిపోయాడు.

'బ్రిటిష్ వాళ్ళకాలం లో వచ్చిన పోస్ట్ స్ అండ్ టెలిగ్రాఫ్స్ ఆక్ట్ ని బంగాళాఖాతం లో యెప్పుడో కలిపేశారుగా?' అంటే, 'అయినా అంతే' అని ఆయన సమాధానం.

......మళ్ళీ ఇంకోసారి.

Friday, April 16, 2010

బ్యూరాక్రసీ

మందమైన చర్మం

'............గల ఆర్గనైజేషన్ లు యేవి అని అడిగితే......'

'నాకుమాత్రం మొట్టమొదట గుర్తొచ్చేది 'జీవన్ బీమా నిగమ్' అని వ్రాశాను కానీ, మొదట మన 'బీ ఎస్ ఎన్ ఎల్' గురించే ముందుగా వ్రాద్దామనిపించింది.

ది గ్రేట్ 'ఇండియన్ పోస్ట్ స్  అండ్ టెలెగ్రాఫ్స్' అనే ప్రభుత్వరంగ సంస్థ చక్కగా పని చేసేది. కొన్ని లక్షల మంది వుద్యోగులు పనిచేసేవారు. గుర్రాలపై, గాడిదలపై, యేనుగుల పై, జడల బర్రెలపై కూడా వుత్తరాలని అందించేవారు. 

'కట్ట కడ కట్ట కడకట్ట కట్ట' ఇలా టెలిగ్రాం ని ప్రసారం చెయ్యడం ఒక కళ!

కొన్నివేలమంది టెలిఫోన్ ఆపరేటర్లు--లోకల్ కాల్స్, ట్రంక్ కాల్స్, అర్జెంట్ కాల్స్, ఎక్స్ ప్రెస్ ట్రంక్ కాల్స్, లైటెనింగ్ కాల్స్--కనెక్టు చేస్తూ, రాత్రింబగళ్ళు నైపుణ్యం గా అవధానాలు చేసేవారు!

మన భారత ప్రభుత్వం నిర్వాకం వల్ల, ఇవన్నీ పూర్వ వైభవాలుగా మిగిలిపోయి, ముక్కలు ముక్కలై, ప్రతీ సంస్థా 'యెవరికి పుట్టిన బిడ్డరా? వెక్కి వెక్కి యేడిచింది?' అన్నట్టు తయారయ్యాయి--ఇప్పటి సంస్థలు. 

...........మళ్ళీ ఇంకోసారి.

Monday, March 8, 2010

భారీ......

తెల్ల యేనుగులు

వీటిగురించి ఓ టపాలో వ్రాశాను--వివరణ మరోసారి ఇస్తాను అని.

వీటిలో, 'విజిలెన్స్ కమిషన్ ' ఒకటి (స్టేట్ అయినా, సెంట్రల్ అయినా).

ప్రభుత్వం లో పై అధికారులు/రాజకీయులు గాని, సంస్థల్లో యాజమాన్యాలుగానీ, యేదైనా కుంభకోణమో, ప్రమాదమో జరిగినప్పుడు, యెవరిని బలిపశువులుగా శిలువ వెయ్యాలో ముందే నిర్ణయించుకుని, అప్పుడు విజిలెన్స్ వాళ్ళకి అప్పగిస్తారు.

ఇక అక్కడనించి, యెక్కడలేని రూల్సూ, జీవోలూ, నిబంధనలూ, వివరణలూ అన్నీ నిందితుడిమీద ప్రయోగిస్తారు. అక్కడతో వాడు హరీమంటాడు.

వుదాహరణకి, మొన్నామధ్య 'బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలతో' బ్యాంకులని మోసగించిన కేసులు ఓ జిల్లా మొత్తం మీద కొన్ని వందలు వెలుగు చూశాయి.

ఇప్పుడు విజిలెన్స్ వారు, 'బ్యాంకు అధికారులదే తప్పు--యెందుకంటే, ఆ పొలం వాళ్ళదే అని నిర్ధారణ అయ్యాక, దాని కొలతలు, వేస్తున్న పంట, మొదలైనవన్నీ తణిఖీ చేసి, అప్పుడు మాత్రమే అప్పు ఇవ్వాలి!' అని నిర్ధారించేశారుట.

అసలు ఫోర్జరీలు చేసినవాళ్ళు, తెలిసీ దొంగ పుస్తకాలని తయారు చేసి అమ్ముకున్నవాళ్ళూ, దళారులూ అందరూ బాగానే వుంటారు--మధ్య బ్యాంకు అధికారులు బలి పశువులు.

ఒక బ్యాంకు శాఖలో కొన్ని వేల పంట ఋణాలు వుంటాయి--వాటిలో వివిధ మండలాలూ, గ్రామాలకి చెందిన రైతులూ, భూములూ వుంటాయి. కనాకష్టం గా ఓ రెండువందలే ఋణాలు వున్నాయనుకున్నా, చిన్నా, సన్నకారు రైతులూ, పెద్ద రైతులూ అందరి కమతాలూ లెఖ్ఖలోకి తీసుకుంటే సగటున రెండు నించి మూడు హెక్టార్లు వుంటాయి. అంటే మొత్తం రెండువందల ఋణాలకీ కలిపి వెయ్యి యెకరాల నించి 1500 యెకరాల మధ్య వుంటాయనుకుంటే, ఆ శాఖ వ్యవసాయాధికారి అంత భూమిని, అన్ని వూళ్ళలో చుట్టివచ్చి, 'నిర్థారణలు ' చేసుకున్న తరవాతే అప్పు ఇవ్వాలంటే, జరిగే పనేనా?

మరి రెవెన్యూ వాళ్ళు సర్టిఫికెట్లూ, అడంగళ్ళూ అవీ జారీ చెయ్యడం యెందుకు?

'పృష్టతాడనాత్ దంత భఙ్గః' అంటే ఇదేనేమో!

Sunday, February 28, 2010

విభజించి.............

రాజకీయం

బొచ్చె చేపల సచ్చినోడు 'తెలంగాణా ఇస్తే తప్పేమిటి?' అన్నాడట.

వీడు రాశ్శేఖర్రెడ్డి శిష్యుడిగా కోట్లు సంపాదించుకున్నాడు--వాడికి వీర విథేయుడు. 

ఇప్పుడు రోశయ్యక్కూడా వీర విథేయుడు (అనుకుంటారు చాలా మంది).

వీడి అసలు రాజకీయం యేమిటి? యెవరు వీడిచేత ఈ మాటలు పలికించారు?

అదీ ఓ ట్రిలియన్ రూపాయల ప్రశ్న!

Thursday, February 25, 2010

జీవితబీమా

అచ్చి రావడం

మొన్నటి అమెరికా ఆన్ లైన్ పత్రిక 'కౌముది' లో బూరుగు గోపీ కార్టూన్ వేశాడు--'ఒకవేళ పొరపాటున నేను చావలేదనుకో, నేను కట్టిన ప్రీమియం డబ్బంతా దండగన్నట్టే కదా?' అంటూ!

మాకు తెలిసిన ఒకాయన వున్నాడు. ఆయన 'ఇన్స్యూరెన్స్' మాటెత్తితే చాలు--మాకొద్దండీ--అది మాకు అచ్చిరాలేదు! అంటాడు.

మరి ఆయన వుద్దేశ్యం లో 'అచ్చి రావడం' అంటే యేమిటో!

వుదాహరణకి, మూడో నాలుగో ప్రీమియాలు కట్టాక చేసినవాడు పోయాడనుకోండి, పూర్తి ఇన్స్యూరెన్స్ సొమ్ము వచ్చేస్తుంది కదా? అప్పుడు అచ్చి వచ్చినట్టే కదా?

లేదూ--ఓ ముఫై నలభై యేళ్ళు ప్రీమియం కడుతూనే వుంటే, ఇన్స్యూర్డ్ మొత్తం కన్నా యెక్కువ ప్రీమియం చెల్లించాడనుకోండి, ప్రీమియం డబ్బు దండగైనా, అన్నాళ్ళూ బ్రతికే వున్నాడు అంటే, అదీ అచ్చి వచ్చినట్టే కదా?

అహా! ఇలాంటివాళ్ళు కూడా వుంటారన్నమాట అనిపిస్తుంది!

Friday, January 15, 2010

నాలుగో జమీ


వాక్ స్వాతంత్ర్యం


ఈ మధ్య మీడియాలో వినిపించిన మాటలు 'ఎక్సైల్డ్'; 'రిలయన్స్ '; 'ద్రౌపది ' 'స్వయం నియంత్రణ' ఇలా చాలా!  


అమెరికా రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి సవరణ ద్వారా వాక్ స్వాతంత్ర్యం ప్రకటించబడి, 'నాలుగో జమీ' (ఫోర్త్ ఎస్టేట్ ని తెలుగులో ఇలా అంటే బాగుంటుందని వాడాను) వాడుకలోకి వచ్చింది అంటారు.  


ఏ ప్రభుత్వానికైనా మూల స్థంభాలైన--చట్ట వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తరవాత--నాలుగో స్థంభం గా దీన్ని గుర్తించారు ప్రపంచ వ్యాప్తంగా.  


మరి యే ప్రభుత్వమైనా ఈ వాక్ స్వాతంత్ర్యాన్ని పరిహరించదలుచుకుంటే? ప్రజలందరూ తిరగబడాలి--దాన్ని కాపాడుకోవాలి!  


మరి ఈ రాజకీయులు--'నియంత్రణ వుండాలి; ఆంక్షలు విధించాలి'అని యెందుకు అరుస్తున్నట్టు? ఒకసారి ఆంక్షలు అంటూ మొదలైతే, యెప్పటికైనా దాన్ని పూర్తిగా హరించకపోతామా, అప్పుడు మనమేమి చేసినా చెల్లుతుంది--అని వీళ్ళ ఆశ.  


తస్లీమా వ్రాసిన 'లజ్జ' లో యేమి వుందో అని ఆసక్తిగా కొని చదివాను--అది నవలా కాదు, కథా కాదు, వ్యాసం కాదు--మరేదో! అందులో బంగ్లాదేశ్ లో 'ఫలానా రోజు ఫలానా వూళ్ళలో ఇన్ని హిందూ ఆలయాల్ని ధ్వంసం చేశారు, ఇంతమంది హిందువులు చనిపోయారు' అంటూ యేకరువు పెట్టింది--అందుకే ఆ ప్రభుత్వానికి అది నచ్చలేదు--ఫత్వా జారీ అయ్యింది!  


ఇక అందుకే, సల్మాన్ రష్డీ తన శాటానిక్ వెర్సెస్ లో యేమి వ్రాశాడొ చదవలేదు నేను!  


మళ్ళీ డా విన్సీ కోడ్ కొనకపోయినా, మా అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు కనపడితే, చదివాను--డా విన్సీ బొమ్మని చక్కగా 'ఇంటర్ప్రెట్' చేసి, చక్కని నవల వ్రాశాడు--అవన్నీ నిజాలే అనిపించేంతగా! 


తమకి చేతనైతే ఆ విషయాలూ, ఇచ్చిన ఉదాహరణలూ తప్పని నిరూపించాలిగానీ, దాన్ని యెవరూ చదవడానికి వీల్లేదు అంటే?  


ఇక ద్రౌపది లో ఆయనేమి వ్రాశాడో, ముందుమాటలోనే చెప్పాడట! ఇష్టం వుంటే చదవండి, లేకపోతే లేదు--ఇంత రాధ్ధాంతం యెందుకు?  


ఇక టీవీ విషయానికొస్తే, వాళ్ళకి యే విషయాన్నైనా, యెప్పుడైనా చూపించే హక్కు వుంది, వుండాలి! చూస్తారోలేదో, చూపిస్తారోలేదో, మీ యిష్టం!  


ఎక్సైలెడ్ బ్లాగో, వెబ్ సైటో తెలియదు గానీ, వాడేదో యెప్పుడో వ్రాశాడట--దాన్ని తమ యిష్టం వచ్చినప్పుడు ఫలానా ఫలానా చానెళ్ళు చూపించాయట!  


చూసినవాళ్ళో, అది ప్లాన్ చేసినవాళ్ళో విధ్వంసం మొదలెడితే, అది టీవీవాళ్ళదీ, ఆ విలేఖరులదీనా ఆ తప్పు?  


పోలీసుల్నీ, కోర్టులనీ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు ఈ రాజకీయులు!  


ప్రతీ టీవీకీ 'చానెల్ లాక్'; చైల్డ్ లాక్' ఇలాంటివి వున్నాయి! మరి యెవరు యేమి చూడాలి, చూడకూడదు అనే విషయం ప్రభుత్వాలకి యెందుకు?  


ఈ విషయం లో గొల్లపూడివారు దాదాపు 20 యేళ్ళ క్రితమే యేమి వ్రాశారో చదివారా? లేకపోతే చదవండి--


http://gollapoodi.blogspot.com/2009/11/blog-post_25.htmlhttp://gollapoodi.blogspot.com/2009/11/blog-post_25.html


తరవాత, 'సెన్షేషనలిజం' అని ఒక మాటని మీడియాకి అన్వయించడం మొదలెట్టారు!  


ఈ టాపిక్ మీద ప్రపంచ వ్యాప్తం గా అనేక భాషల్లో అనేక నవలలు వచ్చాయి--ఇంగ్లీషులో ఆర్థర్ హెయిలీ 'ది ఈవెనింగ్ న్యూస్' చదవండి చాలు!  


'బేసిక్' గా, 'ఫండమెంటల్'గా ప్రింటు గానీ, ఎలెక్ట్రానిక్ గానీ, యే మీడియా అయినా ఫక్తు 'వ్యాపార సంస్థలు!' 


మరి అవి తమ చదువరులనీ, ప్రేక్షకుల్నీ సంఖ్య పెంచుకోడానికి యే పంథా అనుసరించినా, వాళ్ళిష్టం--మనం వద్దన్నా మానతారా? నష్టాలని చవిచూసి యెత్తేస్తారా? అలా యెత్తేస్తే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలేమయిపోతాయి?  


ఇవన్నీ నిజాలు--ఈ రాజకీయులు మాట్లాడేవే--పచ్చి అబధ్ధాలు!  


యే ప్రభుత్వమూ, యెవరి వాక్ స్వాతంత్ర్యాన్నీ నియంత్రించడానికి ప్రయత్నాలు చెయ్యడానికి వీల్లేదు! 


అదంతే!


ఇంకొక చిన్నమాట!  


"నీ చేతికఱ్ఱని నీ యిష్టం వచ్చినట్టు వూపుకునే హక్కు నీకుంది--అది యెదటివాడి ముక్కుకి తగలనంతవరకూ!"  


(అంటే ముక్కుకితప్ప ఇంకెక్కడ తగిలినా ఫరవాలేదు అనా?)  


ఆలోచించండి!

Thursday, January 7, 2010

బ్యూరాక్రసీ




మందమైన చర్మం


మనదేశం లో అతి మందమైన చర్మం గల ఆర్గనైజేషన్ లు యేవి అని అడిగితే, మీకు గుర్తొచ్చేవి యేమిటి?  


నాకు మాత్రం మొట్టమొదట గుర్తొచ్చేది 'జీవన్ బీమా నిగం' అనే ఎల్ ఐ సీ, తరవాత--మన బీ ఎస్ ఎన్ ఎల్!  


యెందుకంటారా?  


మళ్ళీ వ్రాస్తాను.