Sunday, November 29, 2009

కోట్లలో జరిగే....


జూదాల నిషేధం

‘వస్తువుల సరఫరా గొలుసులో ఉన్న ప్రతీ ఒక్కరికీ గరిష్ఠ లాభ నియంత్రణను విధిస్తే ధరల పెరుగుదలను అరికట్టవచ్చు’ అని అభిప్రాయపడింది—పార్లమెంటరీ అంచనాల సంఘం! వారి నివేదిక పార్లమెంటులో ప్రవేశ పెట్టబడిందట. నవంబరు 14న పార్లమెంట్ చర్చించిందట కూడా!

వాళ్ళు చేసిన అతిముఖ్య సూచన—‘బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పులపై ఫ్యూచర్స్ ట్రేడింగ్ ను నిషేధించాలి’—అని.

పై రెండూ ఎంతచక్కని సిఫార్సులో గమనించండి—వీటిని అమలుపరిచే మగాడు యెవరైనా, యే పార్టీలోనైనా వున్నాడా? వుంటే వెంటనే ఓ పార్టీ పెట్టేస్తే వాణ్ణి ప్రథాన మంత్రిని చెయ్యడానికి యెవరికీ అభ్యంతరం వుండదనుకుంటా!

ఇంకాకొన్ని సిఫారసులు—కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖలో కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ధరల పర్యవేక్షణ విభాగం ఉండాలి. బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పులు తదితర 17 నిత్యావసరాల ధరలను నిత్యం పర్యవేక్షించాలి. నియంత్రణ అధికారాలూ ఇవ్వాలి.

సమాజం లోని అన్నివర్గాలకూ నిత్యావసరాలు అందించే విధం గా రేషన్ సరుకుల సరఫరా వ్యవస్థను పరిపుష్టం చేయలి.

అక్రమ నిల్వల్ని అరికట్టడానికి తాత్కాలిక నోటిఫికేషన్లు కాకుండా శాశ్వత చర్యలు ఉండాలి. కేంద్రం ఆదేశాల మేరకు అక్రమనిల్వలపై చర్యలు తీసుకోని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చ్దే రేషన్ కోటా నిలిపేయాలి.

నిత్యావసరాల చట్టం ఉల్లంఘించే వారిపై కేసుల దర్యాప్తునకు ప్రత్యేక కోర్టులను యేర్పాటు చేయాలి.

ఒకపక్కన పప్పుల ధరలు మండుతుంటే….వ్యాపారులు రెండులక్షల టన్నుల పప్పులను దిగుమతిచేసుకొని, ముంబయి, ట్యూటికోరిన్ రేవుల్లోని గోదాముల్లో దాచిపెట్టడం ఘోరం. నిత్యావసరాల అక్రమ నిల్వలపై ప్రభుత్వం కఠినం గా వ్యవహరించాలి.--ఇవీ!

మన పెజారాజ్యాలూ, లోక్ సత్తాలూ ఇలాంటివాటికోసం ఆందోళనలు చేస్తే బాగుండును!

No comments: