Sunday, August 30, 2009

మన తెలుగుతల్లి


గలగలా కృష్ణమ్మ


అగస్థ్య మహర్షి వింధ్య పర్వతం తలవంచి దక్షిణ భారతానికి వచ్చాక, తన కమండలం లోని నీటిని నర్మద, తపతి, మహానది, కృష్ణ, తుంగభద్ర, కావేరి--ఇలా వివిధ నదులుగా ప్రవహింపచేసి, తిరిగి సముద్ర ప్రవేశం కల్పించాడు!  


కాని, మన కృష్ణమ్మ విజయాద్రి (అర్జునుడు పాశుపతం కోసం తపస్సు చేసిన కొండ), ఇంద్రకీలాద్రి లని సమీపించి, అవి చాలా యెత్తుగా వుండడంతో, అక్కడ ఆగిపోయింది--ఆ భూమంతా పెద్ద జలాశయంగా మారిపోయింది!  


అప్పుడు మళ్ళీ అగస్థ్యుడు అక్కడికి చేరి, శ్రీ కనకదుర్గమ్మని తన ముక్కెర యెరువడిగి, దాంతో విజయాద్రి కి చిన్న 'బెజ్జం' చేశాడు! 


అందులోంచి కృష్ణమ్మ హడావిడిగా వెల్లిపోబోతే, దుర్గమ్మ ముక్కెర కొట్టుకుపోయింది! వెంటనే, కృష్ణమ్మ తన ముక్కెర దుర్గమ్మకి ఇచ్చి, 'అక్కా మళ్ళీ నీదగ్గరికి వచ్చినప్పుడు ఇద్దూగాన్లే!' అంటూ వెళ్ళిపోయింది!  


ప్రవాహ వేగానికి విజయాద్రి రెండుగా చీలిపోయింది! 


దుర్గాంబ కొండా, విజయాద్రి క్రింద వెలసిన వూరే 'బెజ్జం వాడ ', తరవాత 'బెజవాడ ', నేటి 'విజయవాడ '!  


ఆ బెజ్జం మధ్యలోనే, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నేటి 'ప్రకాశం బరాజ్' నిర్మించారు!  


కృష్ణమ్మ తన ముక్కెర అడగడానికి దుర్గమ్మనెప్పుడు సమీపిస్తుందో, అప్పుడే 'కలియుగాంతం' అవుతుందట!  


అదీ సంగతి!

No comments: