Tuesday, April 28, 2009

పచ్చి మోసం

"చేతులు కాలాక…….

………..ఆకులు పట్టుకోవడం" మన భారతీయులకీ, ముఖ్యం గా తెలుగు వాళ్ళకీ బాగా అలవాటే!

“ఓ వుండవల్లి అరుణ కుమార్! ఓ జక్కంపూడి రామ్మోహన రావూ! ఈ ‘మణుప్పురం’, ఈ ‘ముథూట్ ఫైనాన్స్’ ల గురించి మాట్లాడరేమి (రా!)

రామోజీ రావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ ద్వారా జమ కట్టుకున్న ప్రతీ పైస తిరిగి చెల్లించినా, ‘నిబంధనలకి విరుద్ధంగా వసూలు చేశారు’ అంటూ ఓ గోల చేసారే!

మరి వీళ్ళు “యే నిబంధన ప్రకారం ‘గోల్డ్ లోన్’, ‘ఫైనాన్స్’ సాగిస్తున్నారో మీకేమైనా పట్టిందా?

పక్క పెంకుటింట్లో వుండే ఒకాయన మేడలో వున్నా ఒకాయన దగ్గర ‘అత్యవసరం గా అవసరం వచ్చింది, ఈ బంగారు గొలుసు మీ దగ్గరుంచుకొని, ఓ మూడు వందలు ఇప్పించండి’ అంటే, ఆ మేడాయన జాలి పడి, ప్రో నోటు వ్రాయించుకొని, గొలుసు తీసుకొని, ఆ మూడు వందలూ అప్పిస్తే, తరవాత—కొన్నాళ్ళకి ‘నువ్వు పాన్ బ్రోకరు లైసెన్స్ లేకుండా బంగారం తాకట్టు వ్యాపారం చేస్తున్నావు’ అని ప్రభుత్వం ‘అరెస్ట్’ చేసింది!

మరి ఈ ‘మణుప్పురం’, ‘ముథూట్’ లకి కనీసం పాన్ బ్రోకర్ లైసెన్స్ అయినా వుందా?

* * *

ఓ ముప్ఫైయ్యేడేళ్ళ క్రితం, ఓ ‘స్కీము’ వచ్చింది! (పెట్టింది అరవ్వాళ్ళే అని వేరే చెప్పాలా?)

ఓ కాయితం మీద

సీ. నెం. పేరు, అడ్రెస్ నగదు (రూ.)

1. విళ్ళుప్పురం రామనాథన్ 1/-
2. రామనాథన్ కృష్ణన్ 1/-
3. రామనాథన్ వాసంతి 1/-
4. వేల్వెట్టిపురం వేలుపిళ్ళై 1/-
5. వేలుపిళ్ళై పిరభాకరన్ 1/-

ఇలా ప్రింటు చేయించి, అందరికీ కవర్లలో పోస్టులో పంపేవారు!

మనం చెయ్యవలసిందల్లా నెం. 5 స్థానంలో వున్న పేరు తొలగించి, మన పేరూ, అడ్రెస్ వ్రాసి, మనకి తెలిసున్నవాళ్ళందరికీ పంపించాలి! అంతే!

ఇంతకుముందు ఇంకోపని చెయ్యాలండోయ్! మన పైనున్న నలుగురు పేర్లకీ అక్కడ వ్రాసిన అడ్రెస్ లకి ఒక్కొక్క రూపాయి ‘మణియార్డరు’ చెయ్యాలి!

(యెక్కడైనా ఈ గొలుసు తెగి పోతే……..మీకింక మణియార్డరులు ఆగిపోతాయి…..అని ఓ వార్నింగ్ కూడా!)

ఇలా, ఆ నలుగురికీ, వాళ్ళెంతమందికి ఆ కూపన్లు పంపించి వుంటే అన్ని రూపాయల చొప్పున మణియార్డరులు అందేవి!

వాళ్ళతో పాటూ, మనకీ, మనం యెంతమందికి పంపిస్తే, అన్ని రూపాయలూ మణియార్డరు ద్వారా అందేవి!

మా కొండబాబు ఈ స్కీము గురించి చెప్పగానే, నేను ‘ఓ పిచ్చి బాబూ, గొలుసు తెగకుండా, పైనున్న ఒక్క పేరూ వుంచి, మిగతా నాలుగు పేర్లూ మన ఫ్రెండ్స్ వి ఇచ్చెయ్యి’ అన్నాను!

అలా ఓ పాతిక రూపాయలు అందరూ సంపాదించిన గుర్తు!

తరవాత గొలుసు తెగిపోయింది! (కారణం మీరు ఊహించండి!)

అవే రోజుల్లో, డాక్టర్ మహీధర రామ మోహన రావు (నళినీ మోహన రావా?—వీళ్ళిద్దరూ అన్నదమ్ములనుకొంటా—ఒకాయన లెఖ్ఖల గురించీ, ఒకాయన సైన్స్ గురించీ వ్రాసేవారు.) ఆంధ్ర పత్రిక వీక్లీ లో “మనీ సర్క్యులేషన్—పచ్చి మోసం!” అనే వ్యాసం వ్రాశారు!

అది చదివితే తెలిసింది—ఇది యెంత భయంకరమైన మోసమో!

మీకు వెలిగిందా?

(మిగిలింది తరవాత!)

No comments: