Sunday, June 7, 2009

'ఉతూతి...

భారత దేశం లో, చార్లెస్ శోభరాజ్; నట్వర్ లాల్ ల తరవాత అంతటివాడు మళ్ళీ రాలేదు అనుకుంటూండగానే, అశోక్ జడేజా వచ్చేశాడట!

అశోక్ జడేజా ఒక ఆయుర్వేద వైద్యుడు. వాళ్ళ అసలు ఇంటిపేరు ‘దిడావాలా’ ని ‘జడేజా’ గా మార్చుకున్నాడట.
బాబా అవతారం యెత్తాడట. తన తెగ వాళ్ళదగ్గర ‘మాతా వాహనావతి శికోతర్’ ఆశీస్సులతో చిన్న చిన్న మొత్తాలలో తాను సేకరించిన డిపాజిట్లని కొద్ది గంటలలో, రోజులలో రెట్టింపు చేసి తిరిగి అందించేవాడు!

డిపాజిట్లు పెరగడం ప్రారంభించగానే, తిరిగి చెల్లించే వ్యవధిని పెంచుతూ, మూడు రెట్లూ, నాలుగు రెట్లూ ఇస్తాననేవాడట!

ఈ రకం గా గుజరాత్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో 2000 కోట్లకు పైగా జనాలకి టోకరా ఇచ్చాడట!

బేడ్ లక్! మన దక్షిణాది వారు జాతీయ స్థాయిని అందుకోలేక పోయారు!

No comments: